పట్టభద్రుల సీటూ కమలానిదే! | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల సీటూ కమలానిదే!

Mar 6 2025 1:31 AM | Updated on Mar 6 2025 1:30 AM

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌/సాక్షి,పెద్దపల్లి:

రీంనగర్‌– ఆదిలాబాద్‌– నిజామాబాద్‌– మెదక్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్‌ అంజిరెడ్డి విజయం సాధించారు. మూ డు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్‌ రౌండ్స్‌తో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖరారైంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వా త కూడా గెలుపునకు సరిపడా కోటా ఓట్లు రాకపోయినా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి అత్యధిక ఓట్లు రావడంతో అతడినే విజేతగా ప్రకటించారు. చివరి వరకు హోరాహోరీగా పోరాడిన కాంగ్రెస్‌ అభ్యర్థి స్వల్ప ఓట్లతేడాతో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధించటంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగ్గా, మార్చి 3న కౌంటింగ్‌ ప్రారంభించారు. మూడు రో జుల పాటు నిర్విరామంగా మూడు షిఫ్ట్‌ల్లో 800 మంది కౌంటింగ్‌ సిబ్బంది కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియంలో 21 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియ ను చేపట్టారు. సోమవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించిన అధికారులు, మంగళవా రం మధ్యాహ్నం వరకు చెల్లని ఓట్లను వడపోసి, క ట్టలు కట్టారు. మంగళవారం రాత్రి నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్‌ ప్రారంభించి, బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి ఎలిమినేషన్‌ రౌండ్స్‌ను ప్రారంభించారు. ఎలిమినేషన్‌ రౌండ్స్‌లో బరిలో ఉన్న 54మందిలో తక్కువ ఓట్లు కలిగి ఉన్న వారిని ఒక్కొక్కరిగా తొలగిస్తూ, వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్‌ ప్రక్రియను మూడు రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగించారు.

ముగ్గురికే 92.52శాతం ఓట్లు

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చెల్లుబాటు అయిన ఓట్లలో 92.52శాతం (2,06,659) మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ ముగ్గురికే వచ్చాయి. మిగిలిన 53మంది ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కేవలం 16,684 ఓట్లు మాత్రమే సాధించారు.

‘రెండోప్రాధాన్యం’లో సైతం బీజేపీదే హవా

నిర్ధారిత కోటా ఓట్ల్ల కోసం అభ్యర్థుల ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టగా అందులోనూ బీజేపీ అభ్యర్థి అధి క్యం చూపారు. తొలుత 53మందిని ఎలిమినేషన్‌ చే సి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థికి 78,635 ఓట్లు, కాంగ్రెస్‌కి 73,644 ఓట్లు, బీఎ స్పీకి 63,972 ఓట్లు వచ్చాయి. 53మందిని ఎలిమినేషన్‌ చేసినా.. కోటా ఓట్ల్లను ఎవరు సాధించకపోవడంతో మూడోస్థానంలోని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నహరికృష్ణను ఎలిమినేట్‌ చేశారు. అతనికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రసన్నహరికృష్ణను ఎలిమినేషన్‌ చేసిన అనంతరం బీజేపీ అభ్యర్థికి 98,637ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థికి 93,531ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్‌ అభ్యర్థి కన్నా 5,106 ఓట్ల ఆధిక్యంలో ఉండటంతో బీజేపీ అభ్యర్థికి విజయం వరించింది. చివరకు బీఎస్పీ అభ్యర్థికి పోలైన ఓట్లలో చాలామంది రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీకే వేయడంతో కమలం పార్టీకే విజయం దక్కింది.

గ్రాడ్యుయేట్స్‌లోనూ బీజేపీ హవా

అధిక ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి

మూడురోజులు సాగిన ఎమ్మెల్సీ కౌంటింగ్‌

ముగ్గురికే 92.52శాతం ఓట్లు

పట్టభద్రుల సీటూ కమలానిదే!1
1/3

పట్టభద్రుల సీటూ కమలానిదే!

పట్టభద్రుల సీటూ కమలానిదే!2
2/3

పట్టభద్రుల సీటూ కమలానిదే!

పట్టభద్రుల సీటూ కమలానిదే!3
3/3

పట్టభద్రుల సీటూ కమలానిదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement