మావోళ్లు ఎలా ఉన్నరో? | - | Sakshi
Sakshi News home page

మావోళ్లు ఎలా ఉన్నరో?

May 22 2025 12:07 AM | Updated on May 22 2025 12:07 AM

మావోళ్లు ఎలా ఉన్నరో?

మావోళ్లు ఎలా ఉన్నరో?

● దండకారణ్యంలో జిల్లావాసులే కీలకం ● పెరిగిన నిర్బంధం.. జోరందుకున్న ‘కగార్‌’ ఆపరేషన్‌ ● వరుస ఎన్‌కౌంటర్లతో నక్సల్స్‌ ఉక్కిరిబిక్కిరి ● తమవారి క్షేమ సమాచారంపై కుటుంబసభ్యుల్లో ఆందోళన

సాక్షి, పెద్దపల్లి: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వారికి కంచుకోట అయి న ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌తో నెత్తురోడుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో కేంద్ర బలగాలు ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకుంటున్న ఎదురుకాల్పుల్లో సుమారు 300మందికి పైగా మా వోయిస్టులు మృతిచెందారు. ప్రభుత్వ దూకుడు, పె రుగుతున్న నిర్బంధం, వరుస ఎన్‌కౌంటర్లతో ఎ ప్పుడు ఏం జరుగుతుందోనని అజ్ఞాత మావోయి స్టు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తాజా గా మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడంతో జిల్లా నేతల క్షేమసమాచారంపై బంధువుల్లో ఆందోళన నెలకొంది.

భయపెడుతున్న ఘటనలు

మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్‌లో దూ సుకుపోతున్న భద్రతాదళాలకు మనజిల్లాకు చెంది న నేతలు కొరకరాని కొయ్యలా మారారు. కేంద్ర కమిటీతోపాటు వివిధ కీలక స్థానాల్లో మన జిల్లావా సులు దండాకారణ్యంలో కార్యకలాపాలు కొనసాగి స్తున్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా జనతన స ర్కార్‌ను స్థాపించారు. అయితే, మావోయిస్టుల విస్తరణకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో 2009తో ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. అప్పటినుంచి దేశవ్యాప్తంగా ముమ్మరంగా యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్స్‌ సాగిస్తోంది. తాజాగా ప్రభు త్వం ఆపరేషన్‌ కగార్‌ను ప్రారంభించింది. సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, డీఆర్‌జీ, సీ–60, ఎస్‌వోజీ, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పేరుతో అడవులను జల్లెడ పడుతున్నా యి. దీంతో ఏడాదిన్నర కాలంలోనే 300 మందికిపైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతిచెందా రు. ఇందులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన నేతలు ఉన్నట్లు ప్రచారం జరిగినా త్రుటిలో తప్పించుకుంటున్నారు. ఇటీవల జూలపల్లికి చెందిన పుల్లూరి ప్రసాద్‌రావు ఉరఫ్‌ చంద్రన్న మృతిచెందారని ప్రచారం జరిగినా ఇంకా నిర్ధారణ కాలేదు.

జిల్లావాసులే కీలకం

పెద్దపల్లి జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి, జాలపల్లి మండలం వడ్కా పూర్‌ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాద్‌రావు ఉరఫ్‌ చంద్రన్న, పెద్దపల్లికి చెందిన మల్లోజుల వేణుగోపాలరావు ఉరఫ్‌ భూపతి, జూలపల్లి మండలం వెంకట్రాపుపల్లికి చెందిన దీకొండ శంకర్‌, పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన గంకిడి సత్యనారాయణరెడ్డి ఉరఫ్‌ విజయ్‌, పాలితం గ్రానికి చెందిన అలేటి రామలచ్చులు, రామగుండం మండలానికి చెందిన అప్పాసి నారాయణ ఉరఫ్‌ రమేశ్‌, గోపయ్యపల్లికి చెందిన దళ కమాండర్‌ దాతు ఐలయ్య, సుల్తానాబాద్‌ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన జువ్వాడి వెంకటేశ్వర్‌రావు, మంథని మండలం ఎక్లాస్‌పూర్‌ గ్రామానికి చెందిన మల్ల రాజిరెడ్డి ఉరఫ్‌ మీసాల రాజన్న తదితరులు ఉన్నారు. ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి ఎన్‌కౌంటర్‌ జరిగినా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement