‘కాంగ్రెస్‌ నేతలపై చర్య తీసుకోవాలి’ | - | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ నేతలపై చర్య తీసుకోవాలి’

Dec 2 2023 12:48 AM | Updated on Dec 2 2023 12:48 AM

సంధ్యారాణి
 - Sakshi

సంధ్యారాణి

గోదావరిఖని: పోలింగ్‌ సందర్భంగా 144సెక్షన్‌ అమలులో ఉందని, దీనిని ఉల్లంఘిస్తూ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై చర్య తీసుకోవాలని బీజేపీ అభ్యర్థి కందుల సంధ్యారాణి డిమాండ్‌ చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధగా వ్యవహరించిన నాయకులపై ఏం చర్యలు తీసుకున్నారో పోలీసులు, ఎన్నికల అధికారులు చెప్పాలన్నారు. చట్టపరమైన కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్న సమయంలో ర్యాలీలకు ఎవరు అనుమతిచ్చారని, ర్యాలీలు నిర్వహిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే దీనిపై పోలీసులు, ఎన్నికల అధికారులు స్పందించాలని ఆమె కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement