గోదావరిఖని: స్వతంత్ర అభ్యర్థులకు పారదర్శకంగా గుర్తులు కేటాయించినట్లు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, రామగుండం ఎన్నికల రిటర్నింగ్ అధికారి అ రుణశ్రీ తెలిపారు. బుధవారం రిటర్నింగ్ కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. లాటరీ విధానంలో స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించామన్నారు. ఆమోదం పొందిన అభ్యర్థులు 26మంది ఉండగా, ముగ్గురు తమ నా మినేషన్లు ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు. 23మంది పోటీలో ఉన్నారని తెలిపారు. ఇద్దరు స్వతంత్రులు తమ ప్రాధాన్యత క్రమంలో ఒకేగుర్తు ఎంచుకుంటే.. లాటరీ పద్ధతిన గుర్తులు కేటాయించామని ఆయన వివరించారు.
కలెక్టర్ ముజామ్మిల్ఖాన్