గవరమ్మపేట పంట పొలాల్లో ఏనుగుల గుంపు | - | Sakshi
Sakshi News home page

గవరమ్మపేట పంట పొలాల్లో ఏనుగుల గుంపు

Oct 30 2025 7:41 AM | Updated on Oct 30 2025 7:41 AM

గవరమ్మపేట పంట పొలాల్లో ఏనుగుల గుంపు

గవరమ్మపేట పంట పొలాల్లో ఏనుగుల గుంపు

జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట పంటపొలాల్లో బుధవారం ఏనుగుల గుంపు సంచరిస్తోంది. గడిచిన మూడు నెలల నుంచి ఏనుగులు ఈ ప్రాంతా నికి రావడం లేదని పంటలు చేతికందుతున్న సమయంలో మళ్లీ రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వరి,అరటి పంటలు మరో నెల రోజులలో ఇంటికి వస్తాయని, ఇటువంటి సమయంలో మళ్లీ ఏనుగులు రావడంతో పంటకు నష్టం జరుగుతుందని వాపోతున్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుందోనని భయాందోళన చెందుతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించే ఏర్పాట్లు చేయాలని అటవీశాఖాధికారులను రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement