కలెక్టర్‌ ఏరువాక | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ఏరువాక

Jun 12 2025 7:27 AM | Updated on Jun 12 2025 7:27 AM

కలెక్టర్‌ ఏరువాక

కలెక్టర్‌ ఏరువాక

గరుగుబిల్లి: మండలంలోని చిలకాం పంచాయ తీ దత్తివలస గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ పాల్గొన్నారు. పొలంలో దుక్కిచేసి ఏరువాకను ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని దైవంగా భావించి ఆరాధించడం, వ్యవసాయ పనులను ప్రారంభించడం అనాదిగావస్తున్న సంప్రదాయమన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్‌, ఎంపీపీ ఉరిటి రామారావు, డీపీఎం పి.షణ్ముఖరాజు, వ్యవసా యాధికారి విజయభారతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

జన్మనిచ్చిన ఏనుగు

9కి చేరిన ఏనుగుల గుంపు

సీతానగరం: మండలంలోని దట్టమైన తోటలు న్న కోటసీతారాంపురంలో మూడు రోజులుగా ఏనుగుల గుంపు తిష్ట వేశాయి. ఓ ఆడ ఏనుగు బుధవారం మరో గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. దీంతో ఏనుగుల సంఖ్య 9కి చేరింది. ఏను గు ప్రసవ సమయంలో మిగిలిన 7 ఏనుగులు అడ్డుగోడగా నిలిచాయి. జనం కంట పడకుండా రక్షణ కల్పించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement