
రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాలో 11 రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీ సమావేశంలో కురుపాం మండలంలోని సందిగూడ నుంచి కాగుమాను గూడ వరకు 820 మీటర్ల రహదారి నిర్మాణానికి, కాగుమానుగూడ నుంచి సాలిదంగు వరకు 820 మీటర్ల రహదారి, పొద్దీస నుంచి సాలమానుగూడ వరకు 1320 మీటర్ల రహదారి, సాలమాను గూడ నుంచి చాపరాయిగూడ వరకు 1300 మీటర్ల రహదారి, దాముగూడ నుంచి చినబంటుజోల వరకు 815 మీటర్లు, మంటికొండ నుంచి దాముగూడ వరకు 733 మీటర్లు, జె పులుపుట్టి నుంచి వై పులిపుట్టి వరకు 1140 మీటర్లు, జాజరుగూడ నుంచి జె పులుపుట్టి వరకు 1120 మీటర్లు, తిత్తిరి నుంచి దొమ్మిడి వరకు 1208 మీటర్లు, దొమ్మిడి నుంచి గాలిమానుగూడ వరకు 1034 మీటర్లు, తిత్తిరి నుంచి గునుగూడ వరకు 1197 మీటర్ల రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఈ రహదారులు గిరిజన ఆవాసాలను బయట ప్రపంచంతో అనుసంధానం చేసేందుకు అత్యావశ్యమని కమిటీ భావించింది. త్వరగా రహదారుల నిర్మాణం పూర్తిచేసి గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సబ్కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పాలకొండ సబ్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి జీఏపీ ప్రసూన తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్ప్రసాద్