చికెన్‌ | - | Sakshi
Sakshi News home page

చికెన్‌

Apr 18 2025 1:32 AM | Updated on Apr 18 2025 1:32 AM

చికెన

చికెన్‌

బ్రాయిలర్‌ లైవ్‌ డ్రెస్‌డ్‌ స్కిన్‌లెస్‌ శ్రీ127 శ్రీ218 శ్రీ228

మెరిట్‌ జాబితా విడుదల

గుమ్మలక్ష్మీపురం: ఏకలవ్య, ఆదర్శ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు సంబంధించిన మెరిట్‌ జాబితా, విద్యార్థులు ఎంపికై న పాఠశాలల వివరాలను ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ http://twreircet.apcfss.in లో పొందుపర్చినట్లు గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ వీర్‌సింగ్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున విద్యార్థులు/తల్లిదండ్రులు వారి మెరిట్‌ స్థితిని, ఏ పాఠశాలకు ఎంపికయ్యారో ఈ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకుని తదనంతరం చర్యలకు సిధ్ధపడాలని సూచించారు. ఎంపికై న విద్యార్థులు తగిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో 2025 ఏప్రిల్‌ 21 నుంచి 30వ తేదీలోగా ఆయా ఎంపికై న పాఠశాలలకు హాజరై నమోదు ప్రక్రియను పూర్తిచేసుకోవాలని చెప్పారు. ప్రవేశాలకు గడువును పొడిగించబోరని స్పష్టం చేశారు.

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జిల్లాకు పతకాలు

విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఇటీవల గుడివాడలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు పతకాలు సాధించి విజయనగరం కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారు. స్థానిక కోడి రా మ్మూర్తి వ్యాయామ సంఘం ప్రతినిధి, అభిన వ భీమ పెద్ది లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో శిక్షణ పొందిన క్రీడాకారులు స్ట్రాంగ్‌ ఉమన్‌ జారా గోల్డ్‌ మెడల్‌ సాధించగా, ఉదయ్‌ అనే మరో క్రీడాకారుడు ద్వితీయస్థానంలో నిలిచి సి ల్వర్‌ మెడల్‌ సాధించాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అభినందించారు.

బైపీసీ విద్యార్థులకు అవకాశం

శ్రీకాకుళం రూరల్‌: ఇంటర్మీడియెట్‌ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు పారామెడికల్‌ నర్సింగ్‌, బీపీటీ, ఎంఎల్‌టీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు రాగోలులోని బొల్లినేని మెడిస్కిల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 19లోగా దర ఖాస్తు చేసుకోవాలని కోరారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం కల్పించి ఫీజును జీతంలో మినహాయిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9121999654, 76809 45357 నంబర్‌ను గానీ, రాగోలు జెమ్స్‌ ఆసుపత్రి లోని బొల్లినేని మెడిస్కిల్స్‌ను గానీ సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

పోలీస్‌ కుటుంబానికి

సిబ్బంది ‘చేయూత’

రూ.3 లక్షల ఆర్థిక సాయం

విజయనగరం క్రైమ్‌: ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగంలో పనిచేస్తూ ఇటీవల మృతిచెందిన కానిస్టేబుల్‌ సీహెచ్‌.గోపాలరావు కుటుంబానికి ఏఆర్‌, సివిల్‌ సిబ్బంది అండగా నిలిచారు. తాము పోగుచేసిన సొమ్ము రూ.3 లక్షల 60 వేల నగదును ఎస్పీ వకుల్‌ జిందల్‌ చేతుల మీదుగా మృతుడి సతీమణి శారదకు గురువారం అందజేశారు. 2000 బ్యాచ్‌కు చెందిన ఏపీఎస్పీ, ప్రస్తుతం ఏఆర్‌ కన్వర్షన్‌గా బదిలీపై వచ్చి విధులు నిర్వహిస్తున్న మిలీనియం బ్యాచ్‌ కానిస్టేబుల్స్‌ స్వచ్ఛందంగా పొదుపు చేసిన రూ.3లక్షల 60వేలను సహచర ఉద్యోగి అకాలమరణం చెందడంతో ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థికంగా భరోసా కల్పించారని ఎస్పీ వకుల్‌ జందల్‌ ఈ సందర్భంగా అన్నారు. మృతుడి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం సకాలంలో కల్పించే విధంగా చర్యలు చేపడతామని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అందుకుగల సర్టిఫికెట్లను డీపీఓలో అందచేయాలని మృతుడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఆర్‌ ఏఎస్పీ నాగేశ్వరరావు, ఆర్‌ఐలు గోపాలనాయుడు, రమేష్‌, శ్రీనివాస్‌ రావు, మిలీనియం బ్యాక్‌ కానిస్టేబుల్స్‌ వెంకటేశ్వరావు, ఉమా మహేశ్వరరావు, పైడితల్లి, కృష్ణమోహన్‌, శేషగిరి, రమేష్‌, మోహన్‌, రమేష్‌, హరిశంకర్‌, చిట్టిబాబు, సీతారాం, చక్రధర్‌, ప్రసాద్‌లు పాల్గొన్నారు.

చికెన్‌1
1/1

చికెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement