గురుకుల పాఠశాలలు,
కళాశాలల్లో ప్రవేశాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకై ఏప్రిల్ 24న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీలోపు దరఖాస్తు చేయాలని సంస్థ గుంటూరుజిల్లా కన్వీనర్ ఎం.రజిని శుక్రవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. పాత గుంటూరు నందివెలుగురోడ్డులోని ఉర్దూ బాలుర గురుకుల పాఠశాలతోపాటు, సంగడిగుంటలోని బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి, 6,7,8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకై విద్యార్థులు ఏపీఆర్ఈఐఎస్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు. నందివెలుగురోడ్డులోని గురుకుల ఉర్దూ బాలుర జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంపీసీ, సీఈసీ గ్రూపులలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు.


