
ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ జట్ల ఎంపిక
చిలకలూరిపేట: చిలకలూరిపేట ఏఎంజీ పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం అండర్–19 బాలురు, బాలికల ఉమ్మడి గుంటూరు జిల్లా బాస్కెట్బాల్ జట్ల ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి సుమారు 80 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల హెచ్ఎం కృపాదానం, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరరాఘవయ్యలు ప్రారంభించిన ఈ క్రీడా పోటీలను ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్ఎఫ్ కార్యదర్శి నరసింహారావు, సహాయ కార్యదర్శి పద్మాకరరావు పర్యవేక్షించారు.
ఎంపికై న బాలురు జట్టు: నాగశరత్, అస్రామ్, ఎండి అబ్దుల్ సమీర్, కె.జయరామ్, యశ్వంత్, యు హేమంత్రెడ్డి, జె అంకమ్మరావు, త్రినాథ్, ఎస్ వెంకటరాజేష్, ఎల్.లాకేష్, సీహెచ్ అక్ష, కె.వంశీకృష్ణ.
బాలికల జట్టు: ఇ.ప్రశాంతి, శ్రీ చందన, జి.అనిత, జి.మనీష, నేత్ర, పి.పావని, పి.హారిక, బి.శ్రీవల్లి, బి.రష్మి, కె.శ్రావ్య, జి.గౌతమి, పి.జ్యోతి చంద్రిక, పి.అమృతవర్షిణి. ఎంపికై న క్రీడాకారులను ఎస్ఎఫ్ కార్యదర్శి నరసింహారావు, సహాయ కార్యదర్శి పద్మాకరరావులతో పాటు పీఈటీలు, ఇతర పెద్దలు అభినందించారు.