వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీలు తొలగించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీలు తొలగించిన పోలీసులు

Oct 7 2025 3:41 AM | Updated on Oct 7 2025 3:41 AM

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీలు తొలగించిన పోలీసులు

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీలు తొలగించిన పోలీసులు

● నగర పంచాయతీ మొత్తం అనధికారికంగా కూటమి నేతలు ఫ్లెక్సీలు భారీ ఎత్తున ఉన్నాయని, వాటిని తొలగించకుండా వైఎస్సార్‌ సీపీకి చెందిన ఫ్లెక్సీలు తొలగించటంపై కమిషనర్‌ని ప్రశ్నించారు. నగర పంచాయతీలో ఏ అధికారం ఉందని ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారని, తక్షణమే తొలగించిన ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని వైస్‌ చైర్మన్‌ కొమెరబత్తిన విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ నాయకుడికి అభినందనలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తొలగించటం మంచి పద్ధతి కాదని, కమిషనర్‌ పచ్చ చొక్కా వేసుకుని ఉద్యోగం చేయాలని నాయకులు అన్నారు. తొలంగించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే బాధ్యత తాను తీసుకుంటామనని, ఇకపై ఇటువంటి తొందరపాటు పనులు జరగవని కమిషనర్‌ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. ఆందోళన చేసిన వారిలో పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్‌ సుభానీ, మాజీ సర్పంచ్‌ మందపాటి రమేష్‌రెడ్డి, అధికార ప్రతినిధి షేక్‌ జాకీర్‌హుస్సేన్‌, వైస్‌ ఎంపీపీ తండా అబ్దుల్‌సత్తార్‌, కౌన్సిలర్లు మందపాటి వీరారెడ్డి, ఈదా వెంకటరెడ్డి, నాగుబండి గురువులు, చాట్ల క్రాంతికుమార్‌, నాయకులు కుందురు తిరుపతిరెడ్డి, మునగా శ్రీనివాసరావు, కొలా జంపాలరెడ్డి, కొమ్ము బుజ్జి, జక్కా అశోక్‌, నాళం శ్రీనివాసరావు, బొడ్డు నాగేశ్వరరావు, కొండవీటి కొండలరావు, బొల్లంపల్లి మరియదాసు, కొర్రపాటి ఏర్రయ్య, వలి, నాగరాజు, జంగాల సింగరయ్య యాదవ్‌, వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

దాచేపల్లి పోలీసుల తీరుపై వైఎస్సార్‌ సీపీ నేతల మండిపాటు నగర పంచాయతీ కమిషనర్‌ కార్యాలయం వద్ద ఆందోళన ఫ్లెక్సీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హామీ

దాచేపల్లి: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో వైఎస్సార్‌ సీపీకి చెందిన ఫ్లెక్సీలను సోమవారం పోలీసులు అకారణంగా తొలగించారు. ఎటువంటి అనుమతులు లేకుండా నగర పంచాయతీ నిండా టీడీపీ, జనసేన ఫ్లెక్సీలు ఉన్నప్పటికి వాటిజోలికి వెళ్లకుండా వైఎస్సార్‌ సీపీకి చెందిన ఫ్లెక్సీలను దాచేపల్లి సీఐ పి.భాస్కర్‌ దగ్గరుండి తొలగించటం వివాదస్పమైంది. సీఐ భాస్కర్‌ తీరుపై వైఎస్సార్‌ సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ కొప్పుల సుబ్బమ్మ పెద్దకుమారుడు రవికుమార్‌ జన్మదినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌ సీపీ కార్యాకర్తలు, నాయకులు నగర పంచాయతీలోని ప్రధాన కూడళ్లలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. రవికుమార్‌కి అభినందనలు తెలియజేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఫొటోలతో కూడిన ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేయడమే ఆలస్యం అన్నట్లుగా.. తొలగించేందుకు సీఐ భాస్కర్‌ రంగంలోకి దిగారు. దాచేపల్లి బస్టాండ్‌ సెంటర్‌, నారాయణపురం ఆర్‌అండ్‌బీ బంగ్లా సెంటర్‌, ముత్యాలంపాడు రోడ్డు సెంటర్‌లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను యుద్ధప్రాతిపదికన తొలగింపజేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు తొలుత నగర పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. అనంతరం కమిషనర్‌ జి.వెంకటేశ్వర్లుతో నాయకులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement