గుంటూరు ఎడ్యుకేషన్: ఎస్జీటీల బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ను రద్దు చేసి, మాన్యువల్ విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలు ఫలించాయి. డీఈవో కార్యాలయాల ముట్టడి, నిరాహార దీక్షలతో తీవ్రమైన ఒత్తిడి తెచ్చిన ఫలితంగా ప్రభుత్వం దిగి వచ్చింది. ఎట్టకేలకు మాన్యువల్ కౌన్సెలింగ్కు అంగీకరించింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో మాన్యువల్ విధానంలో జరగనున్న కౌన్సెలింగ్కు హాజరుకావాలంటూ విద్యాశాఖాధికారులు సోమవారం రాత్రి ఉపాధ్యాయులకు సమాచారాన్ని చేరవేశారు.
తొలుత 350 మందికి పిలుపు
సీనియార్టీ జాబితాలో పేర్లు ఉన్న మొదటి 350 మంది ఉపాధ్యాయులను పిలవడంతో ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా వారంతా జెడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభించాలి. విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి సీనియార్టీ జాబితాలతో పాటు కౌన్సెలింగ్కు సంబంధించి విధి, విధానాలు రావాలంటూ జిల్లా విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులను వేచి ఉండమని చెప్పారు. రాత్రి 8.30 గంటలకు కూడా పిలవక పోవడంతో ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు జెడ్పీ ప్రాంగణంలోని చెట్ల కింద గడిపారు.
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆగ్రహం
వెబ్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహణకు అంతా సిద్ధమని చెప్పిన అధికారులు మాన్యువల్ విధానానికి వచ్చేసరికి సీనియార్టీ జాబితాలు సిద్ధం కాలేదని చెప్పడంపై ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే గంటల కొద్దీ సమయాన్ని తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఆర్థికంగా పైసా భారం లేని బదిలీల విషయంలో ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
ఆందోళనలతో దిగి వచ్చిన ప్రభుత్వం ఎస్జీటీల బదిలీల్లో మాన్యువల్ కౌన్సెలింగ్కు అంగీకారం జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు కౌన్సెలింగ్కు ఉపాధ్యాయులను పిలిచిన అధికారులు రాత్రి 8.30 గంటలకు కూడా మొదలు కాని కౌన్సెలింగ్ నేటికి వాయిదా వేసిన అధికారులు
నేటికి వాయిదా వేసిన అధికారులు
రాత్రి 8.30 గంటల వరకు కౌన్సెలింగ్ ప్రారంభించని అధికారులు సాంకేతిక కారణాలతో బుధవారం ఉదయానికి వాయిదా వేశారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ఉపాధ్యాయులు నిరాశతో వెనుదిరిగారు. బుధవారం ఉదయం 9 గంటలకు వరుస క్రమంలో ఒకటి నుంచి 750 వరకు పేర్లున్న జెడ్పీ ఎస్జీటీ తెలుగు ఉపాధ్యాయులు హాజరుకావాలని డీఈవో సీవీ రేణుక సూచించారు. కాగా నగరపాలకసంస్థ, మున్సిపల్ ఉపాధ్యాయులకు వెబ్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
ఫలించిన గురువుల పోరాటం