
మొక్కుబడి పనులు
నరసరావుపేట ఈస్ట్ : కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా ఉపాధ్యాయులు బదిలీల కోసం పడిగాపులు కాస్తున్నారు. పల్నాడు జిల్లా పరిధిలో దాదాపు 6,582 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పటికీ 2 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు పెండింగ్లోనే ఉన్నాయి. జిల్లా పరిధిలో గురువారం 750 మంది ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్ ప్రకటించగా, రాత్రి పొద్దుపోయే సమయానికి సగం మందికి కూడా ప్రక్రియ పూర్తికాని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 1,585 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 1,46,771 మంది విద్యార్థులు చదువుతున్నారు. బదిలీల పరిస్థితి ఇలా ఉండగా పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానోపాధ్యాయులు బదిలీలపై వేరే పాఠశాలలకు వెళ్లిపోవటంతో అప్పటివరకు పనిచేసిన పాఠశాలల పరిస్థితిని పట్టించుకునే వారే కరువయ్యారు.
కిట్లు.. తప్పని పాట్లు
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలలు తెరిచిన మొదటిరోజే విద్యాకానుక కిట్లను అందించేవారు. కూటమి ప్రభుత్వం ఇస్తానని చెప్పిన విద్యా మిత్ర కిట్లు మాత్రం బడులకు ఇంకా పూర్తిస్థాయిలో చేరనేలేదు. యూనిఫామ్, షూస్, సాక్స్లను పంపించలేదు. త్వరలో నిర్వహించనున్న మెగా పేరెంట్ డే సమావేశాలలో వాటిని పంపిణీ చేసేందుకు ప్రస్తుత కిట్లో వాటికి చేర్చలేదనేది విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
అసంపూర్తిగా ఉన్న ఓ మున్సిపల్ హైస్కూల్లోని తరగతి గదుల నిర్మాణం
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కొలిక్కి రాలేదు. పాఠశాలల్లో నాడు– నేడు పనులు పూర్తి కాలేదు.. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ప్రభుత్వ బడులు సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పునఃప్రారంభం కానున్నాయి. పేద విద్యార్థులు ఎక్కువగా చదివే ప్రభుత్వ పాఠశాలలపై చంద్రబాబు సర్కారుకు ఉన్న కపట ప్రేమ మరోసారి నిరూపితం అయ్యేలా ప్రస్తుతం దుస్థితి కళ్లకు కడుతోంది.
నేటి నుంచి పాఠశాలలు
పునఃప్రారంభం
పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు
అసంపూర్ణంగా వచ్చిన
విద్యా మిత్ర కిట్లు
యూనిఫాం, బూట్లు, సాక్స్లు
లేకుండానే పాఠశాలలకు చేరిక
అసంపూర్తిగా ‘నాడు– నేడు’
ప్రగతి పనులు
మొండి గోడలతో దర్శనమిస్తున్న
తరగతి గదులు, టాయ్లెట్లు