
బ్లాక్ బర్లీ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కంపెనీలదే
నరసరావుపేట: బ్లాక్ బర్లీ పొగాకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కొనుగోలు కంపెనీలపై ఉందని, వచ్చే ఏడాదిలో పొగాకు సాగు ప్రోత్సహించడం ఉండదని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే పి.పుల్లారావుతో కలసి పొగాకు కొనుగోలు కంపెనీలు, రైతులు, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వచించారు. కలెక్టర్ మాట్లాడుతూ కష్టకాలంలో రైతులను ఆన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత అన్నీ కంపెనీలపై ఉందన్నారు. గత ఏడాది దిగుబడి తక్కువగాను, డిమాండ్ అధికంగా ఉన్నందువల్ల రైతులు బ్లాక్ బార్లీ పొగాకు పంటపై మొగ్గు చూపారన్నారు. గతేడాది సుమారు 8500 ఎకారాలలో పొగాకు సాగుచేయగా ఈ ఏడాది 19,500 ఎకరాలలో సాగు చేశారన్నారు. ఎమ్మెల్యే పుల్లారావు మాట్లాడుతూ జిల్లాలో చివరి క్వింటా వరకు పత్తి కొనుగోలు జరుగుతుందని, మార్క్ఫెడ్ ద్వారా ఈనెల 16 నుంచి కొనుగోలు ప్రారంభం అవుతుందన్నారు. క్వింటాకు రూ.12వేలు వరకు అందించి ముఖ్యమంత్రి ఆదేశానుసారం రైతులను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. పలువురు కంపెనీల ప్రతినిధులు, రైతులు లేవనెత్తిన అంశాలపై తగు చర్యలు తీసుకుంటామని, ఆయా కంపెనీల యాజమాన్యాలతో చర్చిస్తామని తెలిపారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, మార్క్ఫెడ్ డీఎం కృష్ణారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
వచ్చే ఏడాది సాగును ప్రోత్సహించం సమీక్షలో స్పష్టం చేసిన కలెక్టర్

బ్లాక్ బర్లీ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కంపెనీలదే