దుర్గమ్మ సన్నిధిలో భక్తుల తాకిడి | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల తాకిడి

Jun 2 2025 2:01 AM | Updated on Jun 2 2025 2:01 AM

దుర్గ

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల తాకిడి

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వేసవి సెలవులు ముగియ నుండటంతో, వివాహ ముహుర్తాల నేపథ్యంలో నూత న వధూవరులు, భక్తులు, యాత్రికులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి కనిపించగా, ఎటువంటి ఇబ్బంది కలుగకుండా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దేవస్థాన కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించారు. ఘాట్‌రోడ్డు, మహామండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. సర్వదర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలైన్‌ ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటలు, రూ.100, రూ.300 టికెట్‌పై దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది.

వీఐపీ దర్శనాలను బ్రేక్‌

ఉదయం 11–30 గంటల నుంచి మధ్యాహ్నం 1–30 గంట వరకు వీఐపీ దర్శనాలను దేవస్థాన అధికారులు నిలిపివేశారు. అమ్మవారికి మహానివేదన నిమిత్తం ఉ దయం 11–45 గంటల నుంచి 12–15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మహానివేదన అనంతరం రూ. 500టికెట్ల విక్రయాలను నిలిపివేసి, రూ. 300 టి కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు బంగారువాకిలి దర్శ నం కల్పించారు. మధ్యాహ్నం 2గంటల వరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సాయ ంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీసేవలో పలువు రు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఏడు గంటలనుంచి భక్తుల తాకిడి కనిపించింది.

మహానివేదన తర్వాత వీఐపీ దర్శనాలకు బ్రేక్‌ అంతరాలయ దర్శనం రద్దు

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల తాకిడి 1
1/1

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల తాకిడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement