
లైంగికదాడి, హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
విజయపురిసౌత్: ఆశా వర్కర్పై లైంగికదాడి చేసి, హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులకు మంగళవారం గుంటూరు కోర్టు జీవిత ఖైదు, జరిమానా విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మాచర్ల మండలం అనుపు చెంచుకాలనీకి చెందిన రమావత్ నీలావతి (46) కొప్పునూరు, నాగులవరం పంచాయతీ పరిధిలోని అనుపు చెంచుకాలనీ, బీకెవీ పాలెం చెంచుకాలనీలో ఆశావర్కర్గా పనిచేస్తుంది. నీలావతి భర్త లస్కర్కు రెండో భార్య. లస్కర్ మొదటి భార్య సాయితో గ్రామ శివారులోని పొలంలో నివాసం ఉంటుంటాడు. 2022 సెప్టెంబర్ నెల 16వ తేదీ సాయంత్రం 6గంటలకు లస్కర్ నీలావతితో మాట్లాడి పొలానికి వెళ్లాడు. 17వ తేదీ ఉదయం ఇంటికి రాగా నీలావతి ఇంట్లో కనిపించలేదు. దీంతో పక్క ఇంటిలో ఉంటున్న నీలావతి తండ్రి లాలుకు విషయం తెలియజేశాడు. దీంతో ఇద్దరు గ్రామంలో విచారించగా మండ్లి ముత్తయ్య రాత్రి 9గంటల ప్రాంతంలో నీలావతి మా ఇంటివైపు వచ్చి సెల్ఫోన్ పోయిందని చెప్పిందని, అదే సమయంలో బీకెవీ పాలెంకు చెందిన సావిటి చిన్న అంజి, శీలం అంజి, శీలం భైస్వామి కూలి డబ్బుల కోసం తన దగ్గరకు వచ్చినట్లు తెలిపాడు. ఆ ముగ్గురు బీకెవీ పాలెంలో వెంకన్న అనే వ్యక్తి పోయిన సెల్ఫోన్ ఎక్కడ ఉంతో కనిపెడతాడని చెప్పటంతో వారితో నీలావతి ఆ గ్రామానికి వెళ్లిందని చెప్పాడు. దీంతో భర్త లస్కర్, గ్రామస్తులు వెంకన్నను విచారించగా తన దగ్గరకు వచ్చిన మాట వాస్తవమేనని సెల్ఫోన్ స్విచ్ఆఫ్లో ఉందని తరువాత రోజు వస్తే చూస్తానని చెప్పటంతో నీలావతితో పాటు ఆ ముగ్గురు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్లారని చెప్పాడు. గతంలో నేర చరిత్ర ఉన్న సావిటి చిన అంజి, శీలం అంజిలను గ్రామస్తులు గట్టిగా అడగటంతో ముగ్గురం లైంగిదాడి చేశామని, నీలావతి గొడవ చేయటంతో శీలం అంజి రాయితో తల మీద కొట్టటంతో మృతి చెందిందని చెప్పారు. రోడ్డు పక్కన సమీపంలో రెండు బండరాళ్ళ మధ్య నీలావతి మృతదేహాన్ని ఉంచి తాటాకులు కప్పినట్లు చెప్పి సంఘటన స్థలాన్ని చూపించారు. విషయాన్ని భర్త లస్కర్, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించటంతో ముగ్గురు నిందితులైన చిన అంజి, శీలం అంజి, శీలం భైస్వామిలను అదుపులోకి తీసుకున్నన్నారు. సావిటి చిన అంజి, శీలం అంజిలు గతంలో 2020 జనవరి నెలలో వెల్థుర్తి మండలం గుడిపాడు చెరువు గ్రామానికి చెందిన మహిళను అనుపువద్ద లైంగికదాడి చేసి హతమార్చిన కేసులో నిందితులు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు
2022లో ఆశావర్కర్పై లైంగిదాడి చేసి హతమార్చిన దుండగులు
అప్పటి పల్నాడు జిల్లా ఎస్పీ శివశంకర్ రెడ్డి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కేసులో నిందితులపై అప్పటి నాగార్జునసాగర్ ఎస్ఐ పి.అనిల్కుమార్రెడ్డి, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ యు.రవిచంద్ర కేసు నమోదు చేశారు. ప్రస్తుత పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు మానిటరింగ్ ద్వారా నరసరావుపేట మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణ, కోర్టు హెడ్ కానిస్టేబుల్ టి.మాణిక్యాలరావు, అడిషనల్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ పల్లపు కృష్ణ నిందితులకు శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించారు. ముగ్గురు నిందితులకు గుంటూరు 5వ అడిషనల్ కోర్టు జడ్జి కె.నీలిమ 376 డీ సెక్షన్ కింద 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.20వేల జరిమానా, అలాగే 376 ఏ సెక్షన్ కింద 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.20వేల జరిమానా, 302సెక్షన్కు గానూ జీవిత ఖైదు, 20వేల రూపాయల జరిమానా, 201 సెక్షన్ కింద 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

లైంగికదాడి, హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు

లైంగికదాడి, హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు