
మూడు బైకులు ఢీ
రాజంపేట: కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని రాజంపేట గుండ్లూరు క్రాస్ రోడ్డులో మూడు బైక్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బోయనపల్లిలో ఇంజినీరింగ్ చదువుతున్న గుంటూరుకు చెందిన మోహనకృష్ణ(20) మృతి చెందాడు. రామాపురానికి చెందిన ఇద్దరు, చొప్పావారిపల్లికి చెందిన ఇద్దరు, సమీప తోటలో పనిచేసే మరో వ్యక్తి గాయపడ్డారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మన్నూరు పోలీసులు తెలిపారు.
ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పలువురికి గాయాలు