ఆస్తి కోసం కన్న కొడుకు దాడి | - | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం కన్న కొడుకు దాడి

Jun 10 2025 6:59 AM | Updated on Jun 10 2025 6:59 AM

ఆస్తి కోసం కన్న కొడుకు దాడి

ఆస్తి కోసం కన్న కొడుకు దాడి

నరసరావుపేట రూరల్‌: ఆస్తి కోసం కన్న కొడుకే దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని రాజుపాలెం మండలం అంచులవారిపాలెంకు చెందిన పొతంశెట్టి మంగమ్మ జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి పిర్యాదులు స్వీకరించారు. వివిద సమస్యలకు సంబంధించిన 51 ఫిర్యాదులు పోలీసులకు అందాయి.

వృద్ధ తల్లిదండ్రులపై దాడి

అంచులవారిపాలెంకు చెందిన మంగమ్మ, నాగయ్య దంపతులకు ఒక ఆడ, ఇద్దరు మగ సంతానం. పెద్ద కుమారుడు ఐదు సంవత్సరాల క్రితం చనిపోగా, చిన్న కుమారుడు ఏడుకొండలుకు వివాహం జరిపించి తన వాటా ఆస్తిని పంచి ఇచ్చారు. వృద్ధ దంపతులు బతకడానికి ఉంచుకున్న 1.30 సెంట్లు భూమిని, ఇంటి స్థలాన్ని సైతం తనపేరిట రాయాల్సిందేనని ఏడుకొండలు ఈనెల 1వ తేదీన మంగమ్మ, నాగయ్యలపై దాడికి పాల్పడ్డాడు. తలకు తీవ్ర గాయమైన మంగమ్మ సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందింది. 14 కుట్లు పడ్డాయి. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

బ్యాంక్‌ కాంప్లెక్స్‌లో బెల్టుషాపు

సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల ఆంధ్రా బ్యాంక్‌ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న బెల్ట్‌షాపు వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాంప్లెక్స్‌లోని దుకాణాదారుడు చిలుకొటి శ్రీనివాసరావు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. మద్యం సేవించిన వ్యక్తులు అపస్మారక స్థితిలో తన దుకాణం ముందు పడి ఉండటం వలన వ్యాపారం సరిగా నిర్వహించలేకపోతున్నామని తెలిపాడు. దీనిపై ఎకై ్సజ్‌, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

రక్షణ కల్పించండి

మతాంతర వివాహం చేసుకున్న తమకు యువతి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని జొన్నలగడ్డకు చెందిన పిల్లుట్ల సతీష్‌రెడ్డి, కరిష్మాలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

గత ఏడాది అక్టోబర్‌లో ఇరువైపుల తల్లిదండ్రుల అంగీకారంతో వివాహం చేసుకున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు విడాకులు ఇవ్వకపోతే చంపుతామని తన తండ్రి బెదిరిస్తున్నట్టు కరిష్మా ఫిర్యాదులో తెలిపింది. తమకు రక్షణ కల్పించాలని కోరారు.

పోలీసు పీజీఆర్‌ఎస్‌లో అంచులవారిపాలెంకు చెందిన వృద్ధురాలు ఫిర్యాదు మొత్తం 51 అర్జీలు స్వీకరించిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు

జనసేన నాయకుడు రూ.14లక్షలు తీసుకుని మోసం చేశాడు

నరసరావుపేట రూరల్‌: విదేశాల్లో ఉన్న తమ కుమారులపై కారు ప్రమాద కేసు నమోదు కావటంతో దాన్ని పరిష్కరిస్తానని గురజాలకు చెందిన జనసేన నాయకుడు కటకం అంకమ్మరావు రూ.14 లక్షలు తీసుకొని మోసం చేశాడంటూ దుర్గికి చెందిన ప్రమీల అనే మహిళ జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేసింది. కారు ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అంకారావును సంప్రదించగా ఆందోళన చెందవద్దని సమస్య పరిష్కరిస్తానని, దీనికిగానూ రూ.46 లక్షలు డిమాండ్‌ చేశాడన్నారు. రూ.7లక్షలు చొప్పున రెండు దఫాలుగా రూ.14లక్షలు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. సమస్య పరిష్కారం కాకపోవటంతో అంకారావును తిరిగి డబ్బులు అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని, డబ్బులు ఖర్చు అయ్యాయని బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. తమకు న్యాయం చేసి తన డబ్బులు తనకు ఇప్పించాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement