
దాడులు తగవు
ఏ విషయంలో అయినా పొరపాటుగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేయవచ్చు. అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటే సరిపోతుంది. గతంలోనూ ఎందరో నాయకులు మహిళలపై వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రత్యేకంగా సాక్షి పత్రిక కార్యాలయాల వద్ద ఆందోళనలు, దాడులు చేయటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాజకీయ కక్షగా దీనిని మలచుకోవాలనుకోవటం ఏమాత్రం సబబు కాదు. వీటిని ప్రజాస్వామ్య వాదులు ఎవరూ హర్షించరు.
–షేక్ శిలార్ అహమద్,
సీపీఎం పట్టణ కార్యదర్శి, నరసరావుపేట