
బోధనావిధానంలో మార్పులకు శ్రీకారం
నరసరావుపేట ఈస్ట్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందించే దిశగా పలు మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరం నుంచి తీసుకువస్తున్న మార్పులపై ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు అవగాహన కల్పించే విధానంలో భాగంగా జిల్లా రిసోర్స్ పర్సన్స్కు జిల్లాస్థాయి 3రోజుల శిక్షణ తరగతులు మంగళవారం మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో ప్రారంభించారు. ప్రారంభ సమావేశంలో పాల్గొన్న డీఈఓ చంద్రకళ మాట్లాడుతూ, ఈ విద్యాసంవత్సరం నుంచి చేపట్టిన మార్పులలో భాగంగా మూల్యాంకన పుస్తకాలు – నిర్వహణ, అకడమిక్ క్యాలెండర్, హ్యాండ్ బుక్, గ్రంథాలయాల నిర్వహణ, బ్రిడ్జి కోర్సులపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించనున్నట్టు వివరించారు. జిల్లావ్యాప్తంగా 130 మంది రిసోర్స్ పర్సన్స్కు ఆయా అంశాలలపై మూడు రోజుల పాటు జరగనున్న శిక్షణా తరగతులలో అవగాహన కల్పించనున్నారు. ఎస్సీఈఆర్టీ పరిశీలకులు లక్ష్మీప్రసన్న, డీసీఈబీ చైర్మన్ ఐ.కృష్ణానాయక్, డైట్ అధ్యాపకులు బి.బాలకోటయ్య, ఎం.సాంబశివరావు, రాష్ట్ర రిసోర్స్ పర్సన్స్, సబ్జెక్ట్ నిపుణులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ