యోగాతో మానసిక ఉల్లాసం | - | Sakshi
Sakshi News home page

యోగాతో మానసిక ఉల్లాసం

Jun 5 2025 8:02 AM | Updated on Jun 5 2025 8:02 AM

యోగాతో మానసిక ఉల్లాసం

యోగాతో మానసిక ఉల్లాసం

విజయపురి సౌత్‌త్‌: యోగాతో ఒత్తిడి దూరమై మానసిక ఉల్లాసం కలుగుతుందని పల్నాడు జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన అనుపు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ప్రసిద్ధ పర్యాటక కేంద్రంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సుమారు 2000 మంది పాల్గొన్నారన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి మురళి మాట్లాడుతూ.. ఈ నెల 21వ తేదీన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణానికి చెందిన మెట్టు గోవిందరెడ్డి దాదాపు 200 యోగా మ్యాట్స్‌ను కలెక్టర్‌ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. బెలూన్లను గాలిలోకి వదిలారు. నాగార్జునకొండ క్యూరేటర్‌ కమల్‌ హాసన్‌, పర్యాటక శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ ప్రసన్న లక్ష్మి, పర్యాటకశాఖ డివిజనల్‌ మేనేజర్‌ చైతన్య, ఆర్డీవో మురళీకృష్ణ, జిల్లా మెడికల్‌ ఆఫీసర్‌ డా.రవి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ కృష్ణ మోహన్‌, ఈఈ రమేష్‌ ,ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాజా నాయక్‌, డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, ఐసీడీఎస్‌ పీడీ ఉమాదేవి, డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీ రాణి, ట్రాన్స్‌పోర్ట్‌ అధికారి సంజీవ్‌ కుమార్‌, డీఎఫ్‌ఓ ఫైర్‌ శ్రీధర్‌రావు, డీఎల్‌డీవో గబ్రు నాయక్‌, హౌసింగ్‌ ఈఈ రవీంద్ర, డీపీఓ నాగేశ్వర నాయక్‌ , జిల్లా పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ , జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావు, డీసీఓ వెంకటరమణ, ఏపీఎంఐపీ ఆంజనేయులు, ఏపీటీడీసీ డిప్యూటీ మేనేజర్‌ శివారెడ్డి, గ్రౌండ్‌ వాటర్‌ అధికారి శ్రీనివాసరావు, మాచర్ల మున్సిపల్‌ కమిషనర్‌ వేణుబాబు, మాచర్ల తహసీల్దార్‌ కిరణ్‌ బాబు, తదితరులు పాల్గొన్నారు.

పల్నాడు జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement