రైలు ఢీకొని వ్యాపారి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వ్యాపారి మృతి

Jun 8 2025 1:27 AM | Updated on Jun 8 2025 1:27 AM

రైలు

రైలు ఢీకొని వ్యాపారి మృతి

నాదెండ్ల: రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. రైల్వే ఇన్‌చార్జి ఎస్సై దీపిక తెలిపిన వివరాల మేరకు.. సాతులూరు గ్రామానికి చెందిన బయ్యన పరాత్పరరావు (65) రైస్‌మిల్లు వ్యాపారం చేస్తుండే వాడు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో చందవరం–బుక్కాపురం రోడ్డుపై వాకింగ్‌కు వెళ్లాడు. రైల్వే గేటు దాటుతుండగా గుంటూరు–నంద్యాల వెళ్తున్న రైలు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. లోకో పైలట్‌ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. శనివారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి

నరసరావుపేటటౌన్‌: ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం పట్టణంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్‌నగర్‌కు చెందిన ఇల్లూరి వీరాంజనేయరెడ్డి(38) మొదటి రైల్వే గేటు వద్ద రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొంది. సంఘటనలో తీవ్రగాయాలైన వీరాంజనేయరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఇన్‌చార్జి ఎస్‌ఐ దీపిక సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు.

మనవళ్లు దాడి చేశారంటూ ఫిర్యాదు

యడ్లపాడు: మండలంలోని కొండవీడు గ్రామంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒకరికి అమ్మమ్మ, మరోకరికి నాయినమ్మ అయ్యే వృద్ధురాలిపై దాడి చేశారంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం..కొండవీడు గ్రామానికి చెందిన తోట లక్ష్మీకాంతమ్మ తన మనవళ్లు మహేష్‌బాబు, దమ్ము రామారావులకు తరచు డబ్బులు ఇస్తుంటుంది. ఈ విషయాన్ని వారి తల్లులకు చెప్పిందని ఆగ్రహిస్తూ ఈనె 4వ తేదీన మహేష్‌బాబు తన నాయినమ్మపై గొడవపడి జుట్టుపట్టుకుని కొట్టాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. దాడి చేయగానే ఆమె కొండవీడు నుంచి చిలకలూరిపేటలో నివాసం ఉంటున్న తన కుమార్తె మాధవి వద్దకు వెళ్లింది. అయినా ఆమెకు ఫోన్లు చేసి మనవళ్లు వేధింపులకు గురి చేయడంతో పోలీసులను ఆశ్రయించి తన గోడును విన్నవించుకుంది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపారు.

రైలు ఢీకొని వ్యాపారి మృతి 1
1/1

రైలు ఢీకొని వ్యాపారి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement