జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్‌గా విజయలక్ష్మి | - | Sakshi
Sakshi News home page

జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్‌గా విజయలక్ష్మి

May 29 2025 7:29 AM | Updated on May 29 2025 7:29 AM

జిల్ల

జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్‌గా విజయలక్ష్మి

గుంటూరు లీగల్‌: గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్‌గా కుమ్మమూరు విజయలక్ష్మి నియమితులయ్యారు. విజయలక్ష్మి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీకాం చేశారు. గుల్బర్గా యూనివర్సిటీలో 1991లో న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. 1992లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌రోల్‌ అయ్యారు. సోదరుడు కృష్ణకిషోర్‌ వద్ద న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. బుధవారం గుంటూరు జిల్లా కన్జ్యూమర్‌ ఫోరం చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

ఒకటిన జిల్లా క్రికెట్‌ జట్లు

ఎంపిక

గుంటూరు వెస్ట్‌ ( క్రీడలు ): జిల్లా క్రికెట్‌ సంఘం త్రీమెన్‌ కమిటీ ఆధ్వర్యంలో జూన్‌ 1వ తేదీన స్థానిక అరండల్‌పేటలోని పిచ్చుకులగుంటలో జిల్లా జట్ల ఎంపిక నిర్వహిస్తామని సభ్యులు యు.మహతి శంకర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్‌–19 యువకులు జట్టుకు ఉదయం 8 గంటలకు, అండర్‌–19 యువతులకు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. నవంబర్‌ 1,2006 తర్వాత జన్మించినవారై ఉండాలి. అండర్‌–15 బాలికలకు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. నవంబర్‌ 1, 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలి. అండర్‌–23 ఉమెన్స్‌కు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. వీరు నవంబర్‌ 1,2001 తర్వాత జన్మించినవారై ఉండాలి. పోటీలకు హాజరయ్యే క్రికెటర్లు వైట్‌ డ్రెస్‌తోపాటు సొంత కిట్‌ కలిగి ఉండాలి. వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్‌ను తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు మహతి శంకర్‌ను 98491 50249 నంబరులో సంప్రదించాలన్నారు.

నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష

గుంటూరు లీగల్‌: అత్యాచార యత్నం కేసులో నిందితుడికి జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 86 సంవత్సరాల వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నించిన పాలపర్తి మంజు అనే 21 సంవత్సరాల యువకుడిపై పెదనందిపాడు పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో ఈ మేరకు తీర్పు వచ్చింది. నిందితుడికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తూ గుంటూరు ఐదో జిల్లా కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు. బాధితురాలి తరఫున ప్రాసిక్యూషన్‌ న్యాయవాదిగా పల్లపు కృష్ణ వాదనలు వినిపించారు.

11 నెలలుగా

అందని జీతాలు

ఏపీజీఏఈ జిల్లా అధ్యక్షుడు

చాంద్‌ బాషా

గుంటూరు వెస్ట్‌: స్థానిక బీఆర్‌ స్టేడియంలో ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు 11 నెలలుగా జీతాలు అందడం లేదని ఏపీజీఏఈ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ చాంద్‌ బాషా తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌ ఎ.భార్గవ్‌ తేజను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాంద్‌ బాషా మాట్లాడుతూ అంతంత మాత్రపు జీతాలతో నెట్టుకొచ్చే చిరుద్యోగులకు నెలవారీ జీతాలు అందకపోతే చాలా ఇబ్బందులు పడతారన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పులు చేస్తున్నారని తెలిపారు. తక్షణం ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అసోసియేషన్‌ నాయకులు లక్ష్మీనారాయణ, వై.నాగేశ్వరరావు, కోటా సాహెబ్‌, పెదరత్తయ్య, జాన్‌ పాల్గొన్నారు.

జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్‌గా విజయలక్ష్మి 
1
1/1

జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్‌గా విజయలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement