
చిన్నారుల సృజనకు పదను..
గురజాల: పల్నాడు విద్యార్థులు కొత్త ఆవిష్కరణకు ప్రాణం పోశారు. వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తరగతి గదుల్లో బట్టిచదువులు స్వస్తి చెప్పి సృజనకు పదను పెడుతున్నారు. అందుకు నిపుణుల సహకారం ఉంటే అద్భుతాలు సృష్టించేందుకు చిన్నారులు సిద్ధమయ్యారు. రహదారి ప్రమాదాలు, దొంగతనాల నివారణ దృష్టి పెట్టారు. సరికొత్త ప్రాజెక్టును ఆవిష్కరించారు.. గురజాలకు చెందిన మట్టపల్లి మన్హితా రియా,కూరపాటి ఆశ్వని కిర్తీ,మేకల సాయి చరణ్, మేకల అరవింద్, బండి ఆశ్మీత. రోబోటిక్ నిపుణులు ఎస్ఆర్ఎంయూ డైరెక్టర్ దాసరి నరేంద్ర కుమార్ సహకారంతో ముందుకు సాగారు.
చిన్నారుల లక్ష్యం..
రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఒంటరి వారవుతున్న జీవితాలను చూసి చలించిపోయారు. దీంతో ఆ చిన్నారుల మనస్సులో ప్రమాదాలు నివారించాలనే ఆలోచన తట్టింది. సెన్సార్ టెక్నాలజీతో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. రూపొందించేందుకు నెల రోజుల వ్యవధి కాగా రూ.5వేలు ఖర్చు చేసినట్లు చిన్నారులు చెబుతున్నారు.
పనిచేసే విధానం..
వాహనం స్టార్ట్ చేయడానికి ముందుగానే హెల్మెట్ ధరించాలి. వాహనదారుడు వాహనం ఎక్కాగానే హెల్మెట్ ధరించాడా లేదా అని గుర్తు చేస్తుంది. హెల్మెట్లో ఏర్పాటు చేసిన సెన్సార్ వ్యవస్థ బైక్కు అనుసంధానమై ఉంటుంది. హెల్మెట్ ధరించకపోతే వాహనం ముందుకు సాగదు. స్మార్ట్ హెల్మెట్లో మైక్రో కంట్రోలర్, బ్లూటూత్ మాడ్యూల్, ఫ్రెషర్ సెన్సార్, వంటి అత్యాధునిక పరికరాలను ఉపయోగించారు. హెల్మెట్లోని ప్రెషర్ సెన్సార్ హెల్మెట్ ధరించినప్పుడు సిగ్నల్ను బైక్కు వస్తుంది. ఈ సిగ్నల్ వచ్చిన తరువాతనే వాహనం స్టార్ట్ అవుతుంది. ఈ చిన్నారులు ప్రవేశపెట్టిన తీరు ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది.
యాంటీ ధెప్ట్ అలారం..
స్మార్ట్ హెల్మెట్, బైక్ ధెప్ట్ అలారం పరికరాలు వాహనం యజమానికి సెక్యూరిటీని పెంచే కొత్త మార్గాన్ని అందిస్తున్నాయి. ఈ హెల్మెట్, బైక్ ట్రాకింగ్ సిస్టమ్తో అనుసంధానమై ఉంటుంది. ఎవరైనా బైక్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తే వెంటనే అలారం మోగుతోంది. వాహనం ఎక్కడున్నా తమ బైక్ సురక్షితంగా ఉందా లేదా అని తెలియచేస్తుంది. వాహన చోదకుడికి అలసటగా ఉన్నా.. వాహనం అదుపు తప్పుతున్న వెంటనే సమాచారం ఇస్తుంది. కొంత భాగంలో హెల్మెట్ కూడా డేటా యాక్సెస్ ఇవ్వడం ద్వారా యజమానికి వెంటనే సమాచారం వస్తుంది.
ప్రమాదాల నివారణకు వినూత్న ఆలోచన
సెన్సార్ టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్

చిన్నారుల సృజనకు పదను..