
ఎన్టీఆర్కు ఘననివాళి
నరసరావుపేట: తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు చల్లి ఘన నివాళులర్పించారు. అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, ఏఆర్ వెల్ఫేర్ ఆర్ఐ గోపినాథ్, ఎస్బీ సీఐ శరత్ బాబు, సీసీ ఆదిశేషు, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్ పాల్గొన్నారు.
నివాళులర్పించిన జేసీ..
నరసరావుపేట: మహనీయుల జయంతి వేడుకలు నిర్వహించుకోవడం వారికి ఇచ్చే గొప్ప గౌరవమని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మాజీ సీఎం నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు నిర్వహించారు. జేసీ సూరజ్ గనోరే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. డీఆర్ఓ ఏకా మురళి, డిప్యూటి కలెక్టర్ కుమార్, ఆర్డీఓ కె.మధులత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సభ్యుల పేరుతో రూ.4 లక్షల రుణం పొందిన ఆర్పీ
లబోదిబోమంటున్న సభ్యులు
అద్దంకి రూరల్: గ్రూపు సభ్యులకు తెలియకుండా వారి పేరుతో ఆర్పీ.. ఓ బ్యాంకులో రూ. 4 లక్షల రుణం పొందిన సంఘటన ఫిబ్రవరి 2వ తేదీ జరగ్గా అసల్యంగా వెలుగులోకి వచ్చింది. మెప్మా అధికారి శ్రీలత తెలిపిన వివరాల మేరకు.. అద్దంకి మెప్మా కార్యాలయంలో వెంకటేశ్వర మహిళా సమాఖ్య గ్రూపులో ఆర్పీగా పనిచేస్తున్న మల్లాది గాయత్రి ఆదర్శ పొదుపు గ్రూపు సభ్యులకు తెలియకుండా సీసీఎల్ రుణం రూ. 4 లక్షల బ్యాంకు నుంచి తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రూపు సభ్యులు మెప్మా అధికారికి తెలిపారు. ఆమె అప్పటి నుంచి ఆఫీస్కు రాకపోవటంతో ఎందుకు రావటం లేదని మెప్మా అధికారి విచారించగా 4 నెలల నుంచి ఆచూకీ లేదని తెలిసింది. బ్యాంకు వద్దకు వెళ్లి గ్రూపులో వివరాలను సేకరించగా గత నాలుగు నెలల నుంచి రుణం కట్టటం లేదని సీసీఎల్ లోను రూ. 4 లక్షలు, గ్రూపులోను రూ. 3 లక్షలు మొత్తం రూ. 7 లక్షలు రుణం ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఆర్పీ గాయత్రిని ఆమె కూమారుడు ద్వారా ఆఫీస్కు పిలిపించి బుధవారం విచారించగా తాను తీసుకున్న రుణం రూ.4 లక్షల వడ్డీతో సహా చెల్లిస్తానని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన్నట్లు మెప్మా అధికారి తెలిపారు.

ఎన్టీఆర్కు ఘననివాళి