
వైభవంగా పోలేరమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ట
ఈపూరు(శావల్యాపురం)/వినుకొండ : ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామంలో గ్రామస్తులు రూ.25లక్షల వ్యయంతో నిర్మించిన పోతురాజు – పోలేరమ్మ తల్లి దేవాలయం విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి వేదపండితులు వేదమంత్రాలతో గణపతి పూజ, పుణ్యాహావాచనం, మండపారాధన, ప్రధాన హోమాలు, యంత్ర ప్రతిష్ట, మహాపూర్ణాహుతి, విగ్రహా ప్రతిష్ట, మహా కుంభాభిషేకం, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నరసరావుపేట, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గోనుగుంట్ల లీలావతి, తదితరులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. భక్తులకు భారీ అన్నదానం నిర్వహించారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 512.60 అడుగుల వద్ద ఉంది. ఇది 136.1274 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 5,598 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.

వైభవంగా పోలేరమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ట