
పిన్నెల్లి సోదరులపై కేసులు దుర్మార్గం
పిడుగురాళ్ల: పథకం ప్రకారమే గుండ్లపాడు హత్య కేసుల్లో సంబంధం లేకపోయినప్పటికీ పిన్నెల్లి సోదరులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రయ్య హత్యతో వైఎస్సార్ సీపీకి ఎలాంటి సంబంధం లేదని, ఈ హత్యలు టీడీపీ ఆధిపత్య పోరు వలనే జరిగిందని గుర్తు చేశారు. అయినా కేవలం పిన్నెల్లి సోదరులే టార్గెట్గా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్