పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

May 23 2025 2:07 AM | Updated on May 23 2025 2:07 AM

పల్నా

పల్నాడు

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం గురువారం 512.60 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 4,459 క్యూసెక్కులు విడుదలవుతోంది.

కొనసాగుతున్న సదరం క్యాంప్‌

తెనాలిఅర్బన్‌: వికలాంగుల ధ్రువపత్రాల పున:పరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్‌ గురువారం కొనసాగింది.

సుఖీభవ లబ్ధిదారుల నమోదు

నూజెండ్ల: నూజెండ్ల రైతుసేవా కేంద్రంలో అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల నమోదు కార్యక్రమం చేపట్టారు. ఇప్పటివర కు 13,175 మంది వివరాలు నమోదు చేశారు.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లఘిస్తున్నారు. కూటమి నేతల వద్ద మెప్పు కోసం పోలీసులమన్న భావనను పక్కన పెట్టి విపక్ష నేతలను టార్గెట్‌ చేస్తున్నారు. వరుస వెంబడి జరుగుతున్న అక్రమ అరెస్ట్‌లతో రాష్ట్రం అట్టుడుకిపోతుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలను ప్రశ్నిస్తే గొంతులను నులిమేస్తున్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేసేందుకు కొందరు పోలీసులు చేస్తున్న అత్యుత్సాహం ఆ వ్యవస్థపై ప్రజలకు గౌరవం లేకుండా చేస్తోంది. దాచేపల్లి పోలీసుల తీరు రోజురోజుకు వివాదస్పదమౌతున్నది. ప్రధానంగా దాచేపల్లి సీఐగా విధులు నిర్వర్తిస్తున్న పి.భాస్కర్‌ రెడ్‌బుక్‌ కోసమే ఉద్యోగం చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సీఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భాస్కర్‌ ఎంతోమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసి అధికార పార్టీ నేతల దగ్గర మార్కులు కొట్టేందుకు చట్టాన్ని సైతం తుంగలో తొక్కుతున్నాడు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేసిన ఘనుడు దాచేపల్లి సీఐ. అక్రమ అరెస్ట్‌లపై ప్రశ్నించే వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులను పోలీస్‌స్టేషన్‌లోకి రాకుండా అడ్డుకున్న ఈ బేడీల భాస్కర్‌ అగడాలపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారో అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

బీసీ యువకుడిపై ప్రతాపం

టీడీపీ అధికారంలోకి రావడంతో తంగెడ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల యల్లయ్య, కుమారుడు హరికృష్ణలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తుండటంతో తెలంగాణ వెళ్లి డ్రైవర్‌ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో జరిగే పండుగకు వచ్చిన బీసీ యువకుడు హరికృష్ణపై టీడీపీ నేత షేక్‌ జానీబాషా తన అనునయుడితో చెప్పించిన కట్టుకథతో పోలీసులు గురువారం కేసు కట్టారని హరికృష్ణ కుటుంబసభ్యులు వాపోతున్నారు. పోలీసు వాహనంలో కాకుండా టీడీపీ నేత కారులో వచ్చి తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. దాని ఆధారంగానే హరికృష్ణను చిత్రహింసలకు గురిచేశారని వాపోతున్నారు. ఎన్నికల రోజున జరిగిన గొడవలో హరికృష్ణపై కేసు నమోదు చేసి పోలీసులు రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. ఆ గొడవకు సంబంధించి టీడీపీ వారికి రూ.40లక్షలు చెల్లించాలని సీఐ భాస్కర్‌ నేరుగా పంచాయితీ చేశాడు. టీడీపీ నేత జానీబాషా రూ.40లక్షలు ఇస్తేనే కేసులు రాజీకి వస్తామని ఒత్తిడి చేశారు. ఈ కేసులో ఉన్న వైఎస్సార్‌ సీపీ నేతలను ప్రతి రోజూ స్టేషన్‌కి పిలిపించి ఇబ్బంది పెట్టారు. సీఐ తీరుతో వైఎస్సార్‌ సీపీ నేతలు విసుగు చెంది కోర్టుని ఆశ్రయించారు. కోర్టు సైతం సీఐ భాస్కర్‌ తీరుని తప్పుపట్టింది. తంగెడకి చెందిన వైఎస్సార్‌ సీపీ నేతలు దేవళ్ల వీరాస్వామి, గొగిరెడ్డి వెంకటరెడ్డి, వట్టె రామచంద్రారెడ్డితో పాటుగా మరికొందరిపై రకరకాలుగా కేసులతో సీఐ వేధించాడని వారు వాపోతున్నారు.

9

న్యూస్‌రీల్‌

వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే

టార్గెట్‌గా అక్రమ కేసులు, వేధింపులు

ఇప్పటికే సీఐ తీరుపై కోర్టును

ఆశ్రయించిన బాధితులు

టీడీపీ నేతల ఆదేశాలతో బీసీ

యువకుడు హరికృష్ణపై అక్రమ కేసు

థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతో నడవలేని

స్థితిలో ఉన్న కుమారుడిని

చూసి చలించిన తల్లిదండ్రులు

సీఐ భాస్కర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం

చేసిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

పల్నాడు1
1/7

పల్నాడు

పల్నాడు2
2/7

పల్నాడు

పల్నాడు3
3/7

పల్నాడు

పల్నాడు4
4/7

పల్నాడు

పల్నాడు5
5/7

పల్నాడు

పల్నాడు6
6/7

పల్నాడు

పల్నాడు7
7/7

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement