పీటీ వారెంట్‌పై నరసరావుపేట కోర్టుకు బోరుగడ్డ | - | Sakshi
Sakshi News home page

పీటీ వారెంట్‌పై నరసరావుపేట కోర్టుకు బోరుగడ్డ

Published Tue, Mar 25 2025 2:11 AM | Last Updated on Tue, Mar 25 2025 2:10 AM

● ఈ నెల 3న ఫిరంగిపురంలో కేసు నమోదు ● రాజమండ్రి జైలు నుంచి నరసరావుపేట కోర్టుకు హాజరు ● వచ్చే నెల 4వ తేదీవరకు రిమాండ్‌

నరసరావుపేటటౌన్‌: బోరుగడ్డ అనిల్‌ను ఫిరంగిపురం పోలీసులు పీటీ వారెంట్‌పై నరసరావుపేట కోర్టులో సోమవారం హాజరు పరిచారు. అనిల్‌పై ఫిరంగిపురం పోలీసులు ఈ నెల 3వ తేదీన కేసు నమోదు చేశారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న అతన్ని పీటీ వారెంట్‌పై పట్టణానికి తెచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, ఏప్రిల్‌ 4 వరకు రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లను సామాజిక మాధ్యమాల్లో దూషించాడని ఫిరంగిపురంకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ అన్నమ్మ భర్త పెరికల లూర్దయ్య ఈ నెల 3వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు 351(1),351(2), 351(4),352, 356(2),79 బీఎన్‌ఎస్‌, 67 ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement