ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్రీల్
● ముగిసిన సైన్స్ ఎగ్జిబిషన్
మల్కన్గిరిలోని ఉన్నత పాఠశాల అవరణలో జరుగుతున్న రెండు రోజుల సైన్స్ ఎగ్జిబిషన్ శనివారంతో ముగిసింది. విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి మాట్లాడుతూ.. ఇటువంటి పోటీల్లో పాల్గొంటే విద్యార్థుల మేధాశక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని సూచించారు. మొత్తం 7 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి మంజులత బోయి, మల్కన్గిరి సమితి విద్యాశాఖ అధికారి భగీర్థి బెహరా తదితరులు పాల్గొన్నారు. – మల్కన్గిరి
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


