మ్యాచ్‌కు రెడీ | - | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌కు రెడీ

Dec 9 2025 7:02 AM | Updated on Dec 9 2025 7:02 AM

మ్యాచ

మ్యాచ్‌కు రెడీ

● నేడు భారత్‌, దక్షిణాఫ్రికా టీ–20 మ్యాచ్‌

● నేడు భారత్‌, దక్షిణాఫ్రికా టీ–20 మ్యాచ్‌

భువనేశ్వర్‌:

టక్‌ బారాబటి స్టేడియంలో మంగళవారం భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు టీ–20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల క్రికెటర్లు ప్రాక్టీసు మ్యాచ్‌లో పాల్గొన్నాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్‌, సాయంత్రం 5.30 గంటలకు దక్షిణాఫ్రికా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లు తిలకించేందుకు స్టేడియం 6, 7 నెంబర్ల గ్యాలరీల్లోకి ప్రేక్షకులకు అనుమతించారు.

ముందు నుంచే సన్నద్ధం

దక్షిణాఫ్రికాతో జరిగే టీ–20 సిరీస్‌ ఓపెనర్‌ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని టీ–20 ప్రపంచ కప్‌ – 2024 తర్వాత నుంచే సన్నాహాలు ప్రారంభించిందని తెలిపారు. అవసరమైతే తప్ప టీ – 20 జట్టులో పెద్ద మార్పులు చేసేది లేదని ప్రీ–మ్యాచ్‌ విలేకర్ల సమావేశంలో ఆయన ప్రకటించారు.

బారాబటితో మంచి అనుభవం

గతంలో బారాబటి స్టేడియంలో ఐపీఎల్‌, దేశీయ క్రికెట్‌ రెండింటినీ అనుభవించామని, మైదానం పరిస్థితుల గురించి తనకు బాగా తెలుసునని అన్నారు. ఇక్కడ మంచి అనుభవం ఉందని, పిచ్‌ భిన్నంగా ప్రవర్తిస్తుందని తెలిపారు. కానీ పరిస్థితులకు అనుగుణంగా బాగా అలవాటు పడ్డామని అని ధీమా వ్యక్తం చేశారు. హార్దిక్‌ పాండ్యా, శుభ్‌మన్‌ గిల్‌ పూర్తిగా ఫిట్‌గా ఉన్నారు. ఎంపికకు అందుబాటులో ఉన్నారని కెప్టెన్‌ ఽధ్రువీకరించారు.

భారీ జనసమూహం అంచనా

45,000 మందికి పైగా ప్రేక్షకులను ఆకర్షించనున్న హై ప్రొఫైల్‌ ఓపెనర్‌ మ్యాచ్‌కు ముందు సోమవారం బారాబటి స్టేడియంలో భారత్‌, దక్షిణాఫ్రికా జట్టు క్రీడాకారులు ప్రాక్టీస్‌ చేశారు. మొదటి సారిగా బారాబటి ఎర్ర నేల పిచ్‌పై అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించనుంది. క్లాక్‌ టవర్‌ దగ్గర ప్రాక్టీస్‌ స్ట్రిప్‌లు కూడా ఆటగాళ్ల అనుకూలతకు సహాయపడటానికి అదే మట్టిని ఉపయోగించారు.

మ్యాచ్‌ డే ఏర్పాట్లు

రెండు జట్లు మే ఫెయిర్‌ హోటల్‌లో కట్టుదిట్టమైన భద్రతలో బస చేస్తున్నాయి. భువనేశ్వర్‌ పోలీస్‌ కమిషనర్‌ మ్యాచ్‌ డే బాధ్యతలపై అధికారులకు వివరణాత్మక బ్రీఫింగ్‌ నిర్వహించారు. ప్రేక్షకుల నిర్వహణ, ఆటగాళ్ల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. భద్రతా కార్యకలాపాల కోసం మొత్తం 50 ప్లటూన్ల పోలీసులు, 300 మందికి పైగా అధికారులను మోహరించారు. భువనేశ్వర్‌, కటక్‌ మార్గంలో భద్రతను కఠినతరం చేశారు. అదనంగా ప్రముఖుల రక్షణ బృందాలను నియమించారు. క్రికెటర్లు, అధికారులు సకాలంలో నిరంతరాయంగా రాకపోకలకు వీలుగా ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక అమలు చేశారు.

మ్యాచ్‌కు రెడీ 1
1/2

మ్యాచ్‌కు రెడీ

మ్యాచ్‌కు రెడీ 2
2/2

మ్యాచ్‌కు రెడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement