
గ్యాస్ లీకై ఇద్దరికి గాయాలు
ఆమదాలవలస: పురపాలక సంఘ పరిధిలోని మెట్టక్కివలస పదో వార్డు వాంబే కాలనీలో గ్యాస్ లీకై ఇద్దరు గాయాల పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వాంబే కాలనీకి చెందిన గుంటుకు సరస్వతి టిఫిన్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఇంట్లో టిఫిన్ తయారు చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎదురు ఇంట్లో నివసిస్తున్న కోలా మాధవరావు ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నించగా ఆయన కూ డా గాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.70 వేల నష్టం జరిగినట్లు సమాచారం. ఎస్సై ఎస్.బాలరాజు సైతం ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. గ్యాస్ సిబ్బంది పరిశీలించి బాధితురాలి తో మాట్లాడారు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.