గణనాథుని అవతారంలో జగన్నాథుడు దర్శనం | - | Sakshi
Sakshi News home page

గణనాథుని అవతారంలో జగన్నాథుడు దర్శనం

Jun 12 2025 3:05 AM | Updated on Jun 12 2025 3:05 AM

గణనాథ

గణనాథుని అవతారంలో జగన్నాథుడు దర్శనం

రాయగడ: ఈ నెల 27వతేదీన జరగనున్న రథాయాత్రలో భాగంగా బుధవారం జగన్నాథ, బలభద్ర, శుభద్ర దేవతామూర్తులకు దేవస్నాన కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. దేవతా మూర్తులను మందిరం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. దేవస్నానం అనంతరం దేవతామూర్తులైన జగన్నాథ, బలభద్రులకు గణనాథుని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చే సౌభాగ్యాన్ని కల్పించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తహసీల్దార్‌ ప్రియదర్శిన స్వయి, సబ్‌ కలెక్టర్‌ రమేష్‌ కుమార్‌ జెన్న తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.

ముగిసిన బ్రహ్మోత్సవాలు

రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో ఈనెల ఆరో తేదీ నుంచి జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. సుప్రభాత సేవ చూర్ణోత్సవం, వసంతోత్సవం, శ్రీవారి అష్టోత్తర శతనామావళి, 108 కలశాలతో జలాభిషేకం, చక్రతీర్థం, శాత్తుములై, హోమాల కార్యక్రమాలతో పాటు సాయంత్రం మహాపూర్ణహుతి, గరుడ ధ్వజ అవరోహణం, బలిహరణ, పుష్పాంజలి, శ్రీపుష్పయాగం, నీరాజన మంత్రపుష్పములు తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల ఆద్వర్యంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

నదిలో మునిగి వృద్ధురాలు మృతి

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ–79 గ్రామం పోలీసు స్టేషన్‌ పరిధిలోని గినిపల్లి గ్రామానికి చెందిన రామా కారమ్‌ తల్లి లీలా కారామ్‌ (66) మంగళవారం సాయంత్రం శభరి నదిలో స్నానానికి దిగి కాలుజారి పడిపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయింది. చీకటి పడినప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామాలో వెతికితప్పటికీ ఆచూకీ దొరకలేదు. బుధవారం ఉదయం స్థానికులు నది వద్దకు వెళ్లగా. నీటిలో లీలా కారామ్‌ శవమై తేలియాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహన్ని బయటకు తీసి కేసు నమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

గుట్కా తయారీ సామగ్రి స్వాధీనం

రాయగడ: నిషేధిత గుట్కా తయారీ సామగ్రిని స్థానిక జీఎస్‌టి విభాగం కమిషనర్‌ నిహారిక జంకార్‌ స్వాధీనం చేసుకున్నారు. బరంపురం నుంచి కొరాపుట్‌ వైపు వెళ్తున్న పికప్‌ వ్యాన్‌ను జేకేపూర్‌ సమీపంలోని నాగావళి నదీ వద్ద జీఎస్‌టీ అధికారులు ఆపి తనిఖీ చేశారు. అందులో గుట్కా తయారీకి వినియోగించే 30 బస్తాల పనొమాధురి, జర్ధా వంటి వస్తువులు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు పది లక్షల రుపాయలు ఉంటుందని జీఎస్‌టీ కమిషనర్‌ మాధురి అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన దాడుల్లో రూ.4.50 కోట్లను జరిమానాల రూపంలో వసూలు చేసినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.91 లక్షల జరిమానా విధించినట్లు సమకూరిందని వివరించారు.

గణనాథుని అవతారంలో జగన్నాథుడు దర్శనం 1
1/2

గణనాథుని అవతారంలో జగన్నాథుడు దర్శనం

గణనాథుని అవతారంలో జగన్నాథుడు దర్శనం 2
2/2

గణనాథుని అవతారంలో జగన్నాథుడు దర్శనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement