
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
జయపురం: సబ్డివిజన్ కుంధ్రలో కాంగ్రెస్ నేత తిరుపతి గురు స్మారక క్రికెట్ టోర్నమెంట్ను గురువారం సమితి అధ్యక్షురాలు పరమేశ్వరి పొరజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుపతి గురు జిల్లా పరిషత్ సభ్యునిగా ప్రజాలకు అనేక సేవలు అందించారని కొనియాడారు. ఆయన జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించటం ప్రశంసనీమన్నారు. క్రికెట్ కమిటీ ప్రతినిధి బుబులు పట్నాయక్ మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొంటున్నాయని, విజేత జట్టుకు రూ.30 వేలు, రన్నరప్కు రూ.20 వేలు నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో సమితి వైస్ చైర్మన్ తరణీ సేన్ బిశాయి, కుంధ్ర బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోకుల చంద్ర పట్నాయిక్, కార్యదర్శి ధైతేరీ మల్లిక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ గురు, బ్లాక్ బీజేడీ అధ్యక్షుడు బృందావణ మల్లిక్, జిల్లా ప్రాథమిక ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు త్రినాథ్ హరిజన్, సమితి సభ్యులు దామోదర గోండ్, కమిటీ సభ్యులు సబుజ దాస్, నవీణ బిశాయి, అజయ ధను తదితరులు పాల్గొన్నారు.