భువనేశ్వర్‌–అబుదాబి విమాన సేవలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

భువనేశ్వర్‌–అబుదాబి విమాన సేవలు ప్రారంభం

Jun 13 2025 7:13 AM | Updated on Jun 13 2025 7:13 AM

భువనే

భువనేశ్వర్‌–అబుదాబి విమాన సేవలు ప్రారంభం

భువనేశ్వర్‌: యూఏఈ రాజధాని అబుదాబికి రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌ నుంచి డైరెక్ట్‌ విమాన సేవలను రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి గురువారం ప్రారంభించారు. భువనేశ్వర్‌ నుంచి అబుదాబికి ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో ఇండిగో విమానం రాకపోకలు సాగిస్తుంది. స్థానిక బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు ఇది 5వ విమాన సేవ కావడం విశేషం.

చిరుత పులి పట్టివేత

కొరాపుట్‌: నరమాంస భక్షక చిరుత పులిని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం నబరంగ్‌పూర్‌ జిల్లా సరిహద్దు రాయిఘర్‌ సమితికి కూతవేటు దూరంలో చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లా దుద్మా అటవీ ప్రాంతంలో పట్టుకున్నారు. 2024 నుంచి నేటి వరకు ఆరుగురు వ్యక్తులపై దాడి చేసింది. ఈ పులి వల్ల సరిహద్దు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ నెల 7వ తేదీ నుంచి అటవీ సిబ్బంది అనేక ప్రయాసలు పడి చిరుతని పట్టుకున్నారు. సుమారు 20 కెమెరాలు పలు చోట్ల అమర్చి ఈ నాలుగేళ్ల చిరుతని పట్టుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కాంకేర్‌ జిల్లా కేంద్రానికి తరలించారు.

కొరాపుట్‌లో పలు రైళ్లకు

అంతరాయం

కొరాపుట్‌: కొరాపుట్‌ రైల్వే జంక్షన్‌లో శుక్రవారం నుంచి ఈ నెల 19 వరకు పలు రైళ్లకు హాల్టు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. జగదల్‌పూర్‌ నుంచి రౌర్కెలా, భువనేశ్వర్‌, హౌరా వెళ్లే ప్రయాణికులు కొరాపుట్‌ రైల్వేస్టేషన్‌కు రావద్దని సూచించారు. వీరు మనబార్‌, దమంజోడి స్టేషన్లకు చేరుకుని అక్కడి నుంచి ప్రయాణం సాగించాలన్నారు. కొరాపుట్‌–విశాఖపట్నం ఇంటర్‌ సిటీ, ప్యాసింజర్‌ రైళ్లు దమంజోడి వరకే నడుస్తాయని పేర్కొన్నారు. జగదల్‌పూర్‌–విశాఖపట్నం రైళ్ల రాకపోకలలో ఏ మార్పు లేదని, అవి కొరాపుట్‌ స్టేషన్లో ఆగుతాయని స్పష్టం చేశారు. కొరాపుట్‌–సుక్కు డబ్లింగ్‌ పనులు జరుగుతున్నందున రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుందని పేర్కొన్నారు.

గృహ నిర్మాణ పథకంలో అవినీతి!

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి గౌడ్‌గూడ పంచాయతీ కలంగూడలో ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన కింద మంజూరైన నిధులను సమితి ఉపాధ్యక్షుడు నిరంజన్‌ హల్దార్‌ స్వాహా చేసి తమకు ఇళ్లు నిర్మించలేదని గ్రామస్తులు గురువారం ఆరోపించారు. ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రతి లబ్ధిదారుడి వద్ద రూ.40 వేలు తీసుకుని పని పూర్తి చేయలేదని, ఇప్పటికి ఆరు నెలలు గడిచినా దాటవేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై నిరంజన్‌ వద్ద ప్రస్తావించగా.. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మల్కన్‌గిరి కమ్యునిటీ వెల్ఫేర్‌ అధికారి మాట్లాడుతూ పంచాయతీరాజ్‌ అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు.

భువనేశ్వర్‌–అబుదాబి విమాన సేవలు ప్రారంభం 1
1/3

భువనేశ్వర్‌–అబుదాబి విమాన సేవలు ప్రారంభం

భువనేశ్వర్‌–అబుదాబి విమాన సేవలు ప్రారంభం 2
2/3

భువనేశ్వర్‌–అబుదాబి విమాన సేవలు ప్రారంభం

భువనేశ్వర్‌–అబుదాబి విమాన సేవలు ప్రారంభం 3
3/3

భువనేశ్వర్‌–అబుదాబి విమాన సేవలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement