
అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ–9 గ్రామంలో అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. ఎంవీ–79 గ్రామ క్రీడా మైదానంలో భారత్ జట్టు మాజీ మేనేజర్ సత్బీర్ సింగ్ పోటీలను ప్రారంభించారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 16 జట్లు పాల్గొన్నాయి. తొలిరోజున ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోంట, ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ జట్ల మధ్య పోటీ జరిగింది. ముందుగా టాస్ గెలిచిన కోంట జట్టు 112 పరుగులు చేయగా.. 113 పరుగులు చేయాల్సిన భువనేశ్వర్ జట్టు కేవలం 85 పరుగులకే ఆలవుట్ అయింది. దీంతో కోంట జట్టు విజయం సాధించింది. పోటీలకు ఎంవీ–79 గ్రామానికి చెందిన జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్ సభ్యులు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ కర్యకర్తలు దీపాక్ ధత్, పరితోష్ సర్కార్, శంభు బాగ్చి, సచీన్ సర్కార్, సినీయర్ క్రికెటర్ మానాస్ రంజాన్ ఆన్న పాల్గొన్నారు.