రోడ్డు ప్రమాదాలపై అవగాహన
రోడ్డు భద్రతకు సంబంధించిన ఈ అద్భుతమైన సైకత శిల్పం అంతర్జాతీయంగా ప్రఖ్యాత సైకత కళాకారుడు పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ తీర్చిదిద్దారు. శూన్య దుర్ఘటన దినం పురస్కరించుకుని ఈ శిల్పం ఆవిష్కరించినట్లు ఆయన పేర్కొన్నాడు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రజలకు అవగాహన కల్పించడంలో అందరి సహకారాన్ని కూడగట్టుకుని ముందుకు సాగడం ఈ కళాకృతి లక్ష్యంగా పేర్కొన్నారు. రహదారి భద్రతతో ఇంటికి సురక్షితంగా చేరాలనే నినాదంతో రూపుదిద్దుకున్న ఈ శిల్పం పలువురి దృష్టిని ఆకట్టుకుంది.
– భువనేశ్వర్


