
చెట్టును ఢీకొని ఒకరి మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోడియా సమితి ప్రధాన రహదారిలోని నందాగూడ సమీపంలో గురువారం ఉదయం ఓ యువకుడు బైక్పై అతివేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టాడు. కలిమెల సమితి గినిపల్లి గ్రామానికి చెందిన ఇర్మా మాడ్కమి (23) బుధవారం తన బంధువు కుమార్ గూడ గ్రామానికి వెళ్లాడు. అక్కడ నుంచి గురువారం ఉదయం కలిమెల తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు క్షతగాత్రుడిని పోడియా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ విషయం తెలిసిన ఇర్మా తండ్రి గంగా మాడ్కమికి పోడియా ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. పోడియా పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఆరోగ్య కేంద్రానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు .