
భారీగా గంజాయి స్వాధీనం
● ఇద్దరి అరెస్టు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో సుమారు కోటి రుపాయల విలువ చేసే గంజాయిని పోలీసులు గురువారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని అందిన సమాచారం మేరకు పోలీసులు రాయగడ నుంచి గజపతి వైపు వెళ్తున్న లారీని గుణుపూర్ సరిహద్దు వద్ద పట్టుకుని తనిఖీలు నిర్వహించారు. లారీలో పశువుల దాణా 516 బ్యాగుల మధ్య 29 గంజాయి బ్యాగులు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు లారీని సీజ్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయిని ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్కు రవాణా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆలీగడ్ జిల్లా నావున్ గ్రామానికి చెందిన అనిల్ కుమార్, తేకేడర్ గ్రామానికి చెందిన హరీష్ కుమార్గా గుర్తించారు. వారి నుంచి రెండు ఫోన్లతోపాటు రూ.7,100 నగదు, రవాణాకు వినియోగించే లారీని సీజ్ చేశారు. నిందితులను కోర్టుకు తరలించారు.

భారీగా గంజాయి స్వాధీనం