
● కొత్త రేషన్ కార్డుల పంపిణీ
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను రాష్ట్ర ప్రాథమిక విద్య, సాంఘిక సంక్షేమ, మైనారిటీ సెల్ శాఖల మంత్రి నిత్యానంద గోండో ప్రారంభించారు. శనివారం ఉదయం మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాస్తవానికి రాష్ట్ర వినియోగదారులు, ఆహార సర ఫరా, శాస్త్ర సాంకేతిక మంత్రి క్రిష్ట చంద్ర పాత్రో కార్డులను పంపిణీ చేయాల్సి ఉంది. అయితే హెలీకాప్టర్లో సాంకేతిక లోపంతో ఆయన రాలేక పోయారు. దీంతో ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మజ్జి ఆదేశాలతో జిల్లా మంత్రి నిత్యానంద గోండో హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా పది వేల 72 నూతన కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గౌరీ శంకర్ మజ్జి, నర్సింగ్ బోత్ర పాల్గొన్నారు.