జస్టిస్‌ దీక్షిత్‌ కృష్ణ శ్రీపాద ప్రమాణ స్వీకారం | - | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ దీక్షిత్‌ కృష్ణ శ్రీపాద ప్రమాణ స్వీకారం

May 13 2025 1:10 AM | Updated on May 13 2025 1:10 AM

జస్టిస్‌ దీక్షిత్‌ కృష్ణ శ్రీపాద ప్రమాణ స్వీకారం

జస్టిస్‌ దీక్షిత్‌ కృష్ణ శ్రీపాద ప్రమాణ స్వీకారం

భువనేశ్వర్‌: ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ దీక్షిత్‌ కృష్ణ శ్రీపాద సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హరీష్‌ టాండన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో ఒరిస్సా హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. ఈనెల 1న కేంద్రం ఆయన బదిలీని ప్రకటించింది. జస్టిస్‌ దీక్షిత్‌ కృష్ణ శ్రీపాద 1989 జూలైలో న్యాయవాది వృత్తిని చేపట్టారు. ఆయన ప్రధానంగా కర్ణాటక మరియు మద్రాస్‌ హైకోర్టుల్లో ప్రాక్టీస్‌ చేశారు. లా ఆఫ్‌ రైట్స్‌, ఎన్నికల చట్టాలు, సర్వీస్‌ చట్టాలలో ప్రత్యేకత సాధించారు. భారత ఎన్నికల కమిషన్‌కు సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా, 1999లో అదనపు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ), టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌), కర్ణాటక వెటర్నరీ సైన్సెస్‌ యూనివర్సిటీ, బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ మరియు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యునాని మెడిసిన్‌లకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా కూడా పనిచేశారు. 2014 సంవత్సరంలో ఆయన అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులై 2018 సంవత్సరం ఫిబ్రవరి 14 వరకు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందేవరకు ఆయన ఆ పదవిలో నిరవధికంగా కొనసాగారు. 2026 సంవత్సరం జూలై 19న తన పదవి నుంచి విరమణ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement