
యోగాతో మానసిక ఉల్లాసం
యోగా పోటీలకు హాజరైన విద్యార్థులు
జయపురం: జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం జయపురం బ్లాక్ స్థాయి యోగా ఒలింపియాడ్ కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం ప్రకాశ్ చంద్ర పట్నాయక్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా జయపురం బ్లాక్ విద్యాధికారి చందన నాయక్, గౌరవ అతిథిగా బ్లాక్ సహాయ విద్యాధికారి ప్రియంబద పాత్రో హాజరయ్యారు. యోగా ప్రాధాన్యత, యోగా వలన శారీరక, మానసిక వికాశానికి కలిగే లాభాలను విద్యార్థులకు వివరించారు. క్రీడా ఉపాధ్యాయులు ప్రశన్న పాణిగ్రహి, శుబేందు ప్రధాన్, పి.రాజేశ్వరి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. విద్యార్థులకు యోగా పోటీలు నిర్వహించారు. జూనియర్ల పోటీలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి శుబ్రతా సాహు, మున్సిపాలిటీ ఉన్నత పాఠశాల విద్యార్థి మాన్యతా పాత్రో విజేతలుగా నిలిచారు. సీనియర్ల గ్రూప్ పోటీల్లో రొండాపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి వికాశ బారిక్, జయపురం మున్సిపాలిటీ బాలికోన్నత పాఠశాల విద్యార్థి ఆరతి గౌడలు విజేతలుగా నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలలో న్యాయ నిర్ణేతలుగా క్రీడా ఉపాధ్యాయురాలు రీటా సామంతరాయ్, తాపస కుమార్ మహంతి, క్రీడా ఉపాద్యాయులు శుబేందు కుమార్ ప్రధాన్ వ్యవహించారు.

యోగాతో మానసిక ఉల్లాసం

యోగాతో మానసిక ఉల్లాసం

యోగాతో మానసిక ఉల్లాసం