దిఘాలో జగన్నాథ ఆలయ ప్రతిష్టపై వ్యతిరేకత | - | Sakshi
Sakshi News home page

దిఘాలో జగన్నాథ ఆలయ ప్రతిష్టపై వ్యతిరేకత

Apr 30 2025 5:12 AM | Updated on Apr 30 2025 5:12 AM

దిఘాల

దిఘాలో జగన్నాథ ఆలయ ప్రతిష్టపై వ్యతిరేకత

భువనేశ్వర్‌: ప్రసిద్ధ పూరీ శ్రీ జగన్నాథ ఆలయానికి అద్భుతమైన ప్రతిరూపం పశ్చిమ బెంగాల్‌లోని దిఘా ప్రాంతంలో నిర్మితమైంది. ఈ జగన్నాథ ఆలయం బుధవారం ప్రారంభించనున్నారు. దీని నిర్మాణానికి రూ. 250 కోట్లు వెచ్చించారు. పవిత్ర అక్షయ తృతీయ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆలయాన్ని ప్రారంభిస్తారు. పశ్చిమ బెంగాల్‌ దిఘాలోని జగన్నాథ ఆలయంలో జరిగే ప్రతిష్టోత్సవంలో పాల్గొనవద్దని పూరీలోని సువార్‌ మహాసూర్‌ నియోగుల వర్గం నిర్ణయించింది. ఉల్లంఘించిన వారు బహిష్కరణకు గురవుతారని ఈ వర్గం హెచ్చరించింది. కొత్తగా ప్రారంభం కానున్న ఈ ఆలయంలో రాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. దారు విగ్రహాల బదులుగా రాతి విగ్రహాలు ఎంచుకోవడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్ట మహోత్సవానికి శ్రీ మందిరం నుంచి అంతా దూరంగా ఉండాలని సూచించారు ఉల్లంఘనకు పాల్పడితే ఆలయం నుంచి బహిష్కరణ, స్వామి సేవల నుంచి శాశ్వతంగా తొలగింపు వంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

దిఘాలో జగన్నాథ ఆలయ ప్రతిష్టపై వ్యతిరేకత 1
1/3

దిఘాలో జగన్నాథ ఆలయ ప్రతిష్టపై వ్యతిరేకత

దిఘాలో జగన్నాథ ఆలయ ప్రతిష్టపై వ్యతిరేకత 2
2/3

దిఘాలో జగన్నాథ ఆలయ ప్రతిష్టపై వ్యతిరేకత

దిఘాలో జగన్నాథ ఆలయ ప్రతిష్టపై వ్యతిరేకత 3
3/3

దిఘాలో జగన్నాథ ఆలయ ప్రతిష్టపై వ్యతిరేకత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement