అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం

Apr 18 2025 1:35 AM | Updated on Apr 18 2025 1:35 AM

అగ్ని

అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం

కొరాపుట్‌: ప్రతి ఒక్కరికీ అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరమని అసిస్టెంట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సురేష్‌ బారిక్‌ అన్నారు. జయపూర్‌ మెయిన్‌ రోడ్డులోని కలకత్తా బజార్‌ వద్ద రోడ్డుపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పెద్ద భవనాల్లో అగ్ని ప్రమాదాల నుంచి రక్షించుకోవడం కోసం అనేక భద్రతా ఏర్పాట్ల ఉంటాయన్నారు. కానీ ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు ప్రాణ భయంతో వాటిని మర్చిపోతారని పేర్కొన్నారు. అందువలన ఆందోళన చెందకుండా భద్రతా ఏర్పాట్లను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం తన సిబ్బందితో కలిసి మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

తాగునీటికి కటకట

పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్‌ ఎస్‌.కోరడాసింగి గ్రామ పంచాయతీలో బోండా, భుయ్యా సాహి, సన్నో లోబ తదితర గ్రామాల్లో సాగునీరు, తాగునీటి వనరులు లేక ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస బాట పడుతున్నారు. ఇటీవల అధిక ఎండలు కారణంగా తాగునీటికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కలెక్టర్‌ బిజయకుమార్‌ దాస్‌కు ఆయా గ్రామ ప్రజలు గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. రాయఘడ బ్లాక్‌ డంబాపూర్‌ వద్ద మహేంద్రతనయ నదిపై ఆనకట్ట పూర్తిచేయాలని ఆయా గ్రామప్రజలు, న్వాయవది ప్రశాంత్‌ కుమార్‌ ప్రధాన్‌ కలెక్టర్‌ను కోరారు.

పది దుకాణాలకు నోటీసులు

జయపురం: ఉత్కళ దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 1 నుంచి 14వ తేదీలోగా అన్ని ప్రైవేట్‌ వ్యాపార వాణిజ్య సంస్థలకు నేమ్‌ బోర్డులు ఒడియాలో రాయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒడియా భాషలో నేమ్‌ బోర్డులు రాయాలని విస్తృత ప్రచారం చేశారు. చట్టాన్ని, ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణపై జయపురం లేబర్‌ విభాగ అధికారి సబిత కుమారి నాయక్‌ పట్టణంలోని 10 దుకాణాలకు గురువారం నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయక పోతే ఆయా దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేసి, కోర్టు ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒడియాలో బోర్డులు రాయని వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ప్రభుత్వ విభాగాలలో ఎక్కువ మంది ఒడియా భాషేతరులు ఉండటం వలన ఒడియా బోర్డులకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.

అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి ఎం.వి 17 గ్రామం వద్ద గురువారం వ్యాన్‌లో ఆంధ్రాకు ఆవులను అక్రమంగా తరలించడాన్ని చూసి యువకులు వాహనాన్ని ఆపారు. మల్కన్‌గిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఐఐసీ రీగాన్‌ కీండో తన సిబ్బందితో వచ్చి వాహనాన్ని సీజ్‌ చేశారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

బిత్తరబందలో దొంగల హల్‌చల్‌

మందస: మండలంలోని సాబకోట గిరిజన పంచాయతీ బిత్తరబందలో దొంగలు హల్‌చల్‌ సృష్టించారు. బుధవారం రాత్రి కారు, రెండు ద్విచక్ర వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సవర మల్లిక అనేక మహిళపై దాడి చేసి చెవికి ఉన్న బంగారపు రింగులను పట్టుకుపోయారు. ఈ సమయంలో ఆమె ప్రతిఘటించగా కత్తితో దాడికి పాల్పడ్డారు. బాధితురాలిని స్థానికులు గుర్తించి 108 అంబులెన్సులో హరిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బైపీసీ విద్యార్థులకు అవకాశం

శ్రీకాకుళం రూరల్‌: ఇంటర్మీడియెట్‌ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు పారామెడికల్‌ నర్సింగ్‌, బీపీటీ, ఎంఎల్‌టీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు రాగోలులోని బొల్లినేని మెడిస్కిల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 19లోగా దర ఖాస్తు చేసుకోవాలని కోరారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం కల్పించి ఫీజును జీతంలో మినహాయిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9121999654, 76809 45357 నంబర్‌ను గానీ, రాగోలు జెమ్స్‌ ఆసుపత్రి లోని బొల్లినేని మెడిస్కిల్స్‌ను గానీ సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం1
1/3

అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం

అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం2
2/3

అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం

అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం3
3/3

అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement