ముఖ్యమంత్రి పోషణ యోజన ప్రారంభం
కొరాపుట్: ముఖ్యమంత్రి పోషణ యోజన పథకాన్ని రాష్ట్ర ప్రాథమిక విద్యా, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండో మంగళవారం ప్రారంభించారు. సొంత నియెజకవర్గం ఉమ్మర్కోట్లోని ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకాన్ని ప్రారంభించి 9, 10వ తరగతి విద్యార్థులతో కలిసి మధ్యహ్న భోజనం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 10 లక్షల 80 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ భోజనంలో రాగి లడ్డూను వారం రోజులపాటు అందజేస్తారన్నారు. దీని వలన పోషక విలువలు పెరుగుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకాన్ని నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ముఖ్యమంత్రి పోషణ యోజన ప్రారంభం


