ఆలివ్‌రిడ్లే తాబేళ్లను కాపాడడం మనందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

ఆలివ్‌రిడ్లే తాబేళ్లను కాపాడడం మనందరి బాధ్యత

Mar 26 2025 12:53 AM | Updated on Mar 26 2025 12:51 AM

డీఎఫ్‌ఓ కొండలరావు

పూసపాటిరేగ: సముద్రంలో నివసించే ఆలివ్‌రిడ్లే తాబేళ్లను కాపాడడం మనందరి బాధ్యతని డీఎఫ్‌ఓ కొండలరావు అన్నారు. పూసపాటిరేగ మండలం పులిగెడ్డపేట తీరంలో 270 ఆలివ్‌రిడ్లే తాబేళ్ల పిల్లలను సముద్రంలో విడిచిపెట్టా రు. ట్రీ ఫౌండేషన్‌, అటవీశాఖ ఆధ్వర్యంలో 10 రక్షణ కేంద్రాల్లో 517 తాబేళ్ల ద్వారా 56,065 గుడ్లను సంరక్షించినట్టు తెలిపారు. టేకు వలలు, నానాజాతి వలలను మత్స్యకారు లు చేపల వేటకు వినియోగించడంతో ఆలివ్‌రిడ్లేలకు ముప్పువాటిల్లుతోందన్నారు. సముద్ర తాబేళ్లను కాపాడడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్యసంపద అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్టు రేంజ్‌ అధికారి అప్పలరాజు, ఫారెస్టు సెక్షన్‌ అధికారి మధుమోహన్‌, ట్రీ ఫౌండేషన్‌ కో ఆర్డినేటర్‌ కామయ్య, తదితరులు పాల్గొన్నారు.

రైతు ఉత్త్పతిదారుల

సంఘాలకు నాబార్డు చేయూత

నెల్లిమర్ల రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నాబార్డు నుంచి ఆర్థిక సహాయం అందజేస్తామని జిల్లా మేనేజర్‌ నాగార్జున తెలిపారు. మండలంలోని సతివాడ గ్రామంలో శుభోదయం రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులతో మంగళవారం సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల ఏర్పాటు, డ్రోన్‌ మిషన్లు, యాంత్రీకరణ పనిముట్లు కొనుగోలు కు సాయం అందజేస్తామన్నారు. రైతులంతా ఒకే మాటపై ఉండి సంఘ అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ ఆఫ్‌ ఇండియా మార్కెటింగ్‌ జోనల్‌ ఇన్‌చార్జి గోపాల్‌కృష్ణ గోఖులే, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, బీఆర్‌ఈడీఎస్‌ సీఈఓ రామకృష్ణరాజు, సీఈఓ పతివాడ సత్యనారాయణ, సర్పంచ్‌ రేవళ్ల శ్రీనివాసరావు, నాయకులు జమ్ము అప్పలనాయుడు, పంచాది శ్రీరాములనాయుడు, దురగాశి ఎర్రంనాయుడు, మత్స శ్రీనివాసరావు, కంది శ్రీను, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement