బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
నాగేశ్వరి
గుహలను
కొరాపుట్: గనుల తవ్వకాల పేరిట నాగేశ్వరి గుహలను ముట్టుకుంటే క్షమించబోమని గిరిజనులు హెచ్చరించారు. మంగళవారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి కేంద్రంలో వేలాది మంది గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి పేరిట అదానీ కంపెనీకి ఈ గుహలు అప్పగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ గుహలు ఉన్న బల్దా ప్రాంతంలో నాగేశ్వరి కొండలు ఆవరించి ఉన్న 5 పంచాయతీల ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. సీఎల్పీ నాయకుడు, పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర ఖడం ఈ ర్యాలీకి నేతృత్వం వహించారు. భారీ ర్యాలీ అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అడవి బిడ్డల నుంచి భూమిని బలవంతంగా లాక్కునే ప్రక్రియకు తాము వ్యతిరేకమని తెలిపారు. గ్రామ సభ అనుమతి లేకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇదే సభలో ప్రముఖ హక్కుల ఉద్యమ నాయకుడు ప్రపుల్ల సామంత్రాయ్ ప్రసంగించారు. అదానీ కోసం రాజ్యాంగ హక్కులను కాల రాస్తూ గిరిజనులను అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ర్యాలీ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
న్యూస్రీల్
ముట్టుకుంటే క్షమించం
ముట్టుకుంటే క్షమించం