అప్పులు ఎలా తీర్చాలి?
పెసర, పత్తి, మొక్క జొన్న, మినుము సాగుచేశా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పంటనూ కొనలేదు. మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం పంటలు కొనకపోవటంతో దళారులకు తక్కువ ధరకు విక్రయించా. ఇతరుల నుంచి అప్పులు తెచ్చి పంటలు సాగుచేశా. ఆ పంటలు చేతికిరాగానే అప్పుల వాళ్లు ఇంటికి వస్తున్నారు. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావటంలేదు.
– ఉయ్యూరు మల్లారెడ్డి రైతు,
వేములపల్లి, కంచికచర్ల మండలం
●


