
ఇది ప్రజాస్వామ్యంపై దాడి
ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావటం, అవకతవకలను బహిర్గతం చేయడం మీడియా బాధ్యత. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్న సాక్షి పత్రికపై అణచివేత చర్యలు తీసుకో వడం దురదృష్టకరం. ప్రజల నిజమైన స్వరాన్ని వినిపిస్తూ ప్రజాస్వామ్య రక్షణలో ముందుండే పత్రికపై ప్రభుత్వం అక్రమంగా కేసులు మోపడం ఆక్షేపణీయం. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ రక మైన చర్యలకు పాల్పడుతోంది. ఇది సాక్షి పత్రికపై దాడి మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంపై దాడి కూడా.
– పోతిన మహేష్, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, వైఎస్సార్ సీపీ