
రేపు ఐజీఎంసీ స్టేడియంలో బక్రీద్ నమాజు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వుుస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7న ఎంజీరోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం(ఐజీఎంసీ)లో సామూహిక ఈదుల్ అజ్హా నమాజ్(బక్రీద్ నమాజు) నిర్వహిస్తున్నట్లు ఈద్ కమిటీ ప్రధాన కార్యదర్శి మునీర్ అహ్మద్ షేక్ తెలిపారు. గురువారం నమాజు నిర్వహించే ప్రాంగణంలో సామూహిక నమాజు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మునీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రవక్త మహ్మద్ సంప్రదాయం ప్రకారం ముస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో బక్రీద్ నమాజును ఏటా మాదిరిగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందు కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 7 గంటలకు ప్రసంగం, 7.30 గంటలకు ఈద్నమాజు ప్రారంభం అవుతుందన్నారు. సభ్యులు ఎండీ ఇర్ఫాన్, ఎండీ అన్వర్ పాషా, షేక్ వలీ, మఖ్బూల్ అహ్మద్ నద్వీ, ముక్తార్ అలీ, సయ్యద్ అలీమ్ తదితరులు పాల్గొన్నారు.